బహిష్కరణ వేటును తొలగించాలి.. ఓ ప్రవాస భారతీయుడు న్యాయ పోరాటం..!!
- October 22, 2024
యూఏఈ: సైబర్ క్రైమ్ , డిజిటల్ ట్రేడింగ్ కేసులో దోషిగా తేలిన తర్వాత తనపై ఫుజైరా ప్రైమరీ కోర్ట్ విధించిన బహిష్కరణ ఆర్డర్ను రద్దు చేయాలని ఓ భారతీయ ఉద్యోగి న్యాయ పోరాటం చేస్తున్నాడు. బాధితురాలి నుంచి దాదాపు 20,000 దిర్హామ్లను మోసగించి సేకరించినట్టు ఆయనపై కేసులు నమోదయ్యాయి. కాగా, ఆ కేసులో తన పేరును తొలగించాలని కోరుతూ, అతను ఫుజైరా అప్పీల్ కోర్టులో అప్పీల్ చేశాడు. జులైలో టెలిగ్రామ్ ద్వారా తనను సంప్రదించి ఆన్లైన్ ట్రేడింగ్లోకి రావాలని, మెరుగైన లాభాలు తిరిగొస్తాయని నమ్మించి మోసం చేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దర్యాప్తులో, అకౌంట్లలో ఒకటి 26 ఏళ్ల భారతీయ నిందితుడికి చెందినదని పోలీసులు గుర్తించారు. అతనిపై సైబర్ క్రైమ్, మోసం, దాదాపు 20,000 దిర్హామ్లు మోసగించడం వంటి అభియోగాలు మోపారు. అయితే, సదరు ఇన్స్టాగ్రామ్లో మోసానికి ఉపయోగించిన సంస్థలో తాను ఉద్యోగి అని, తనకు మోసం చేసే ఉద్దేశం లేదని పేర్కొన్నారు. ఉద్యోగ విధుల్లో భాగంగా పనులను పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నాడు. తన యజమాని ఖాతాదారులను సంప్రదించి ఆన్లైన్ ట్రేడింగ్ చేసేలా వారిని ఒప్పించడం తన రోల్ అని అతను కోర్టుకు తెలిపాడు. ఖాతాదారులకు చెందిన నిర్దిష్ట బ్యాంక్ ఖాతాలకు డబ్బును బదిలీ చేయమని చెప్పారని, తనను వాట్సాప్ గ్రూప్లో చేర్చారని, అక్కడ తన బ్యాంకు ఖాతా వివరాలను అందించాలని సూచించారని, ఆ తర్వాత డబ్బును సేకరించేందుకు ఆ అకౌంట్ ను ఉపయోగించారని పేర్కొన్నాడు. "తన ఉద్యోగంలో భాగంగా మాత్రమే డబ్బు అందుకున్నాడు. అతను ఆ డబ్బును తన యజమానులకు బదిలీ చేసాడు." అని ప్రవాస భారతీయుడి తరఫు లాయర్ హగాగ్ వాదించాడు. న్యాయవాది తన వాదనకు మద్దతుగా కోర్టుకు పత్రాలను సమర్పించాడు. తన క్లయింట్ను నిర్దోషిగా విడుదల చేయాలని న్యాయమూర్తులను అభ్యర్థించాడు. త్వరలో కోర్టు ముందు ఈ కేసుపై విచారణ జరగనుంది.
తాజా వార్తలు
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!