సౌదీలో కొత్తగా సముద్ర పర్యావరణ చట్టాలు..10 ఏళ్ల జైలు, SR30 మిలియన్ జరిమానా..!!
- October 23, 2024
రియాద్: సౌదీ అరేబియాలో సముద్ర పర్యావరణ చట్టాలకు పదును పెట్టారు. ఇకపై పర్యావరణాన్ని దెబ్బతీసే చర్యలకు పాల్పడితే జైలు శిక్షతోపాటు భారీ జరిమానా విధించబడుతుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. కొత్త పర్యావరణ చట్టం ప్రకారం, ఉల్లంఘించిన వారికి గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష, SR30 మిలియన్ల వరకు జరిమానాలు ఉన్నాయి. సముద్ర ప్రాంతాలు, నీటి వనరులను రక్షించడానికి.. అలాగే సముద్ర ప్రాంతాలను సంరక్షించడానికి ఉద్దేశించిన నిర్దిష్ట నిబంధనలు చట్టంలో ఉన్నాయి. రసాయనాలు లేదా వ్యర్థాల వల్ల కలిగే కాలుష్యం వంటి వాటిని నీటి వనరులకు హాని కలిగించే పర్యావరణ నేరాల కింద చేర్చారు. నేరం తీవ్రతను బట్టి SR1 మిలియన్ నుండి SR30 మిలియన్ల వరకు జరిమానాలు విధించవచ్చని నిబంధనలు చెబుతున్నాయి. పర్యావరణాన్ని పరిరక్షించడంలో ప్రతి ఒక్కరి బాధ్యతగా ఉండాలని, చట్టాలను ఉల్లంఘించిన సందర్భంలో వ్యక్తులు, సంస్థలపై జరిమానాలు ఒకే విధంగా విధించబడతాయని హెచ్చరించారు. అయితే, పర్యావరణ పరిరక్షణకు కొత్త చట్టాన్ని తేవడం పట్ల ప్రకృతి ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!