యూఏఈ వీసా అమ్నెస్టీ స్కీమ్..10వేల మందికి భారత కాన్సులేట్ సహాయం..!!
- October 23, 2024
దుబాయ్: యూఏఈ ప్రకటించిన క్షమాభిక్ష పథకం కోసం భారతీయ ఎంబసీలు అండగా నిలిచాయి. దాదాపు 10 వేలమంది భారతీయులకు సహాయం అందించినట్టు దుబాయ్ లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. బాధితులకు అండగా నిలిచేందుకు అల్ అవీర్లో ఫెసిలిటేషన్ సెంటర్ను ఏర్పాటు చేసి, యూఏఈ వీసా అమ్నెస్టీ ప్రయోజనాలను పొందడంలో భారతీయ పౌరులకు సహాయం చేస్తున్నట్టు తెలిపింది. ఇప్పటివరకు వివిధ భారతీయ డయాస్పోరా సంస్థల సహకారంతో 10వేల కంటే ఎక్కువ మందికి సౌకర్యాలు కల్పించామని, అదే సమయంలో 1300 పాస్పోర్ట్లు, 1700 ఎమర్జెన్సీ సర్టిఫికెట్లు, 1500 కంటే ఎక్కువ ఎగ్జిట్ పర్మిట్లను జారీ చేశామని వెల్లడించింది. యూఏఈ అధికారుల నుండి రుసుము/పెనాల్టీ మినహాయింపులను పొందడంలో సహాయంగా నిలిచినట్టు తెలిపింది. దుబాయ్, నార్తర్న్ ఎమిరేట్స్లోని భారతీయ పౌరులు తమ రెసిడెన్సీని చట్టబద్ధం చేసుకోవడానికి లేదా దేశం విడిచిపెట్టడానికి వీసా అమ్నెస్టీ ప్రోగ్రామ్ను సద్వినియోగం చేసుకోవాలని కాన్సులేట్ కోరింది. యూఏఈకి వచ్చే భారతీయులు ఎంట్రీ, వర్క్, రెసిడెన్సీ కోసం స్థానిక అధికారులు ఏర్పాటు చేసిన సరైన విధానాలను అనుసరించాలని కూడా కాన్సులేట్ సూచించింది.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









