బ్రిక్స్ సదస్సులో మోదీ ప్రసంగం
- October 23, 2024
మాస్కో: భారత్ యుద్ధానికి మద్దతు ఇవ్వదని.. చర్చలు, దౌత్యానికి మాత్రమే మద్దతు ఇస్తుందని బ్రిక్స్ సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రష్యాలో జరుగుతోన్న బ్రిక్స్ సదస్సుకు వచ్చిన దేశాల అధినేతలతో జరిగిన సమావేశంలో మోదీ మాట్లాడారు.
అన్ని వివాదాలు చర్చలతో పరిష్కృతమవుతాయని మోదీ అన్నారు. రష్యాలోని కెసాన్ నగరంలో బ్రిక్స్ సమ్మిట్కు ఆతిథ్యం ఇచ్చినందుకు, గత ఏడాదిగా కూటమికి నాయకత్వం వహించినందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు కూడా ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
ప్రస్తుతం ప్రపంచం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో బ్రిక్స్ సమావేశం జరుగుతోందని అన్నారు. ద్రవ్యోల్బణాన్ని నిరోధించడం, ఆహారం, విద్యుత్తు, ఆరోగ్యానికి భరోసా, నీటి భద్రత, ఆన్లైన్లో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడం, డీప్ఫేక్ల వంటి సైబర్ మోసాలు వంటి ప్రపంచంలో కొత్త సవాళ్లు పుట్టుకొచ్చాయని చెప్పారు.
ప్రపంచం ఇన్ని సవాళ్లు ఎదుర్కొంటున్న వేళ బ్రిక్స్ దేశాల సమూహంపై ప్రపంచానికి అనేక అంచనాలు ఉన్నాయని అన్నారు. బ్రిక్స్ అన్ని రంగాలలోనూ సానుకూల పాత్ర పోషించగలదని తాను నమ్ముతున్నానని మోదీ చెప్పారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







