గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కొత్త ఉప కులపతుల భేటి
- October 23, 2024
హైదరాబాద్: కొత్తగా నియమితులైన రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, ఉన్నత విద్యామండలి ఛైర్మన్, వైస్ ఛైర్మన్లతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమావేశమయ్యారు. ఉన్నత విద్యను ప్రోత్సహించే ఉద్దేశంతో విద్యారంగంలో తీసుకురావాల్సిన ఆవిష్కరణలు, సంస్కరణలపై సమావేశం చర్చించింది.ఈ సందర్భంగా ఓయూ ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగారం గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వ సహకారంతో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని మరింత ఉన్నత స్థితికి తీసుకొచ్చేలా కృషి చేస్తానని అన్నారు. సమావేశంలో పాల్గొన్న ఇతర విశ్వవిద్యాలయాల ఉపకులపతులు విద్యారంగ అభివృద్ధి, విద్యార్థులకు ఉత్తమ నైపుణ్యాలను అందించేందుకు తీసుకోవాల్సిన అంశాలపై పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, వైస్ ఛైర్మన్ ప్రొఫెసర్ ఐ. పురుషోత్తం ఆయా విశ్వవిద్యాలయాల ఉపకులపతులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు









