సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా..!
- October 24, 2024
న్యూ ఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియామకం అయ్యారు.భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియామకాన్ని ధృవీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది.సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాను ఎంపిక చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాను భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం పట్ల కేంద్ర న్యాయ మరియు న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సంతోషం వ్యక్తం చేశారు.
జస్టిస్ ఖన్నా నవంబర్ 11న భారతదేశ 51వ ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన ఏడు నెలల పాటు ఉన్నత న్యాయమూర్తి స్థానంలో బాధ్యతలను నిర్వర్తించనున్నారు. మే 13, 2025 వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సంజీవ్ ఖన్నా పని చేయనున్నారు. పదవీకాలం ముగిసిన CJI DY చంద్రచూడ్ ..జస్టిస్ ఖన్నా పేరును సిఫారసు చేస్తూ కేంద్రానికి లేఖ రాశారు. దీంతో సంజీవ్ ఖన్నాను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎంపిక చేయడం జరిగింది.చంద్రచూడ్ తర్వాత అత్యంత సీనియన్ న్యాయమూర్తి కావడంతోనే సంజీవ్ ఖన్నాకు ఈ అవకాశం దక్కింది.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









