సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా..!
- October 24, 2024
న్యూ ఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియామకం అయ్యారు.భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియామకాన్ని ధృవీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది.సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాను ఎంపిక చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాను భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం పట్ల కేంద్ర న్యాయ మరియు న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సంతోషం వ్యక్తం చేశారు.
జస్టిస్ ఖన్నా నవంబర్ 11న భారతదేశ 51వ ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన ఏడు నెలల పాటు ఉన్నత న్యాయమూర్తి స్థానంలో బాధ్యతలను నిర్వర్తించనున్నారు. మే 13, 2025 వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సంజీవ్ ఖన్నా పని చేయనున్నారు. పదవీకాలం ముగిసిన CJI DY చంద్రచూడ్ ..జస్టిస్ ఖన్నా పేరును సిఫారసు చేస్తూ కేంద్రానికి లేఖ రాశారు. దీంతో సంజీవ్ ఖన్నాను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎంపిక చేయడం జరిగింది.చంద్రచూడ్ తర్వాత అత్యంత సీనియన్ న్యాయమూర్తి కావడంతోనే సంజీవ్ ఖన్నాకు ఈ అవకాశం దక్కింది.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









