ఎన్విరాన్మెంటల్ సానిటైజేశన్ పోటీ విజేతలను సత్కరించిన అల్ బతినా సౌత్ గవర్నర్
- October 24, 2024
అల్ రుస్తాక్: ఏడెస్ దోమలను నిర్మూలించే లక్ష్యంతో నిర్వహించిన ఎన్విరాన్మెంటల్ సానిటైజేశన్ ప్రచార పోటీలో విజేతలను అల్ బతినా సౌత్ గవర్నర్ ఎంగ్ మసూద్ బిన్ సైద్ అల్ హష్మీ సత్కరించారు. ఈ కార్యక్రమంలో అల్ బతిన కౌన్సిల్ సభ్యులు, అల్ బతినా సౌత్ గవర్నరేట్ విలాయత్ల వలీలు, మజ్లిస్ అష్షూరా సభ్యులు, మునిసిపల్ కౌన్సిల్స్ సభ్యులు మరియు వివిధ ప్రభుత్వ మరియు పౌర సంస్థల అధికారులు పాల్గొన్నారు.
ఈ సన్మాన కార్యక్రమం ద్వారా, ఇంటి పరిసరాల పరిశుభ్రతను ప్రోత్సహించడం మరియు ప్రజలలో అవగాహన పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది మరియు విజేతలకు ప్రశంసలు అందజేయడం జరిగింది. ఈ ప్రచారం కేవలం పోటీ మాత్రమే కాకుండా పర్యావరణ సంరక్షణ సంస్కృతిని నిర్మించే దిశగా అడుగులు వేసిందనీ అల్ బతిన గవర్నర్ తెలిపారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









