ఎన్విరాన్మెంటల్ సానిటైజేశన్ పోటీ విజేతలను సత్కరించిన అల్ బతినా సౌత్ గవర్నర్
- October 24, 2024
అల్ రుస్తాక్: ఏడెస్ దోమలను నిర్మూలించే లక్ష్యంతో నిర్వహించిన ఎన్విరాన్మెంటల్ సానిటైజేశన్ ప్రచార పోటీలో విజేతలను అల్ బతినా సౌత్ గవర్నర్ ఎంగ్ మసూద్ బిన్ సైద్ అల్ హష్మీ సత్కరించారు. ఈ కార్యక్రమంలో అల్ బతిన కౌన్సిల్ సభ్యులు, అల్ బతినా సౌత్ గవర్నరేట్ విలాయత్ల వలీలు, మజ్లిస్ అష్షూరా సభ్యులు, మునిసిపల్ కౌన్సిల్స్ సభ్యులు మరియు వివిధ ప్రభుత్వ మరియు పౌర సంస్థల అధికారులు పాల్గొన్నారు.
ఈ సన్మాన కార్యక్రమం ద్వారా, ఇంటి పరిసరాల పరిశుభ్రతను ప్రోత్సహించడం మరియు ప్రజలలో అవగాహన పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది మరియు విజేతలకు ప్రశంసలు అందజేయడం జరిగింది. ఈ ప్రచారం కేవలం పోటీ మాత్రమే కాకుండా పర్యావరణ సంరక్షణ సంస్కృతిని నిర్మించే దిశగా అడుగులు వేసిందనీ అల్ బతిన గవర్నర్ తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







