పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు కన్నుమూత
- October 25, 2024
తెలంగాణ: తెలంగాణ కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత, గుస్సాడి నృత్యానికి జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిన కనకరాజు కన్నుమూశాడు. ఆదిలాబాద్ జిల్లా మార్లవాయి గ్రామానికి చెందిన ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు. గుస్సాడి నృత్యానికి కనకరాజు చేసిన సేవలను గుర్తించిన కేంద్రం ఆయనను 2021లో పద్మశ్రీతో సత్కరించింది. రేపు మార్లవాయిలో ఆదివాసీల సంప్రదాయం ప్రకారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఆసీఫాబాద్లోని ఆదివాసీ బిడ్డల నృత్య రూపకమైన గుస్సాడీకి కనకరాజు ఎనలేని కీర్తిని తెచ్చారు. తమ అస్తిత్వ కళారూపాన్ని ఆయన తరుచూ ప్రదర్శిస్తూ.. భావితరాలకు తమ ఆచార, సంప్రదాయాలను తెలియజేశారు. దీంతో ఆయన పేరు గుస్సాడీ కనకరాజుగా స్థిరపడిపోయింది. ఆదివాసీ కళను బతికిస్తూ.. అందులోనే ఆనందాన్ని వెతుక్కున్న ఆయన పేరును అప్పటి కేసీఆర్ ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుకు సిఫార్సు చేసింది. 2021 నవంబర్ 9న అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!