బహ్రెయిన్ లో అథారిటీ తనిఖీలు.. 208 మంది కార్మికులపై బహిష్కరణ వేటు..!!
- October 29, 2024
మనామా: అక్టోబర్ 20 నుండి 26 వరకు 1,523 తనిఖీలు చేసినట్టు లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) ప్రకటించింది. కార్మిక నిబంధనలను ఉల్లంఘించిన 62 మంది కార్మికులను నిర్బంధించినట్టు, 208 మందిని విచారణ అనంతరం బహిష్కరించినట్టు వెల్లడించింది. బహ్రెయిన్ లో లేబర్ మార్కెట్, రెసిడెన్సీని నియంత్రించే చట్టాలను పరిరక్షించేందుకు LMRA తనిఖీలు చేపడుతోంది. అన్ని గవర్నరేట్లలో 1,491 వ్యాపార సముదాయాలలో 32 జాయింట్ ఇన్స్పెక్షన్ లు నిర్వహించినట్లు LMRA తెలిపింది. ఇందులో క్యాపిటల్ గవర్నరేట్లో 17, ముహరక్ గవర్నరేట్లో 3, ఉత్తర గవర్నరేట్లో 6, సదరన్ గవర్నరేట్లో 6 తనిఖీ క్యాంపెయిన్ లు ఉన్నట్లు పేర్కొంది. కార్మిక చట్టాలకు అనుగుణంగా ఉండాలని నిసితులందరికీ సూచించింది.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







