బహ్రెయిన్ లో అథారిటీ తనిఖీలు.. 208 మంది కార్మికులపై బహిష్కరణ వేటు..!!

- October 29, 2024 , by Maagulf
బహ్రెయిన్ లో అథారిటీ తనిఖీలు.. 208 మంది కార్మికులపై బహిష్కరణ వేటు..!!

మనామా: అక్టోబర్ 20 నుండి 26 వరకు 1,523 తనిఖీలు చేసినట్టు లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) ప్రకటించింది. కార్మిక నిబంధనలను ఉల్లంఘించిన 62 మంది కార్మికులను నిర్బంధించినట్టు, 208 మందిని విచారణ అనంతరం బహిష్కరించినట్టు వెల్లడించింది. బహ్రెయిన్ లో లేబర్ మార్కెట్, రెసిడెన్సీని నియంత్రించే చట్టాలను పరిరక్షించేందుకు LMRA తనిఖీలు చేపడుతోంది. అన్ని గవర్నరేట్‌లలో 1,491 వ్యాపార సముదాయాలలో 32 జాయింట్ ఇన్‌స్పెక్షన్ లు నిర్వహించినట్లు LMRA తెలిపింది. ఇందులో క్యాపిటల్ గవర్నరేట్‌లో 17, ముహరక్ గవర్నరేట్‌లో 3, ఉత్తర గవర్నరేట్‌లో 6, సదరన్ గవర్నరేట్‌లో 6 తనిఖీ క్యాంపెయిన్ లు ఉన్నట్లు పేర్కొంది. కార్మిక చట్టాలకు అనుగుణంగా ఉండాలని నిసితులందరికీ సూచించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com