ఏపీ సీఎంతో కపిల్ దేవ్ భేటీ.. గోల్ఫ్ కోర్స్ ఏర్పాటు పై చర్చ!
- October 29, 2024
అమరావతి: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, గోల్ప్ టూర్ ఆప్ ఇండియా చైర్మన్ కపిల్ దేవ్ ఉండవల్లిలో సీఎం చంద్రబాబును ఆయన నివాసంలో మంగళవారం కలిశారు. కపిల్ దేవ్ కి సీఎం చంద్రబాబు సాదర స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.ఈ భేటీ సందర్భంగా రాష్ట్రంలో గోల్ఫ్ కోర్స్ క్లబ్ ఏర్పాటుపై పలు అంశాలు చర్చలు జరిపారు.
కపిల్ దేవ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో క్రికెట్, గోల్ఫ్ గేమ్స్ కు సంబంధించిన పలు అంశాలతో పాటు వాటి అభివృద్ధికి సంబంధించిన సూచనలపై చర్చించారు. వాటిపై సీఎం చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారు. అమరావతిలో అంతర్జాతీయ గోల్ఫ్ కోర్స్ క్లబ్, అనంతపురం, వైజాగ్లలో ప్రీమియర్ గోల్ఫ్ కోర్స్ క్లబ్లను ఏర్పాటు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించి, ఆంధ్రప్రదేశ్ క్రీడా రంగాన్ని విస్తరించాలని అన్నారు.
విదేశాల్లో బాగా ప్రాచుర్యం పొందిన గోల్ఫ్ ఇప్పుడిప్పుడే మన దేశంలో ప్రాచుర్యం సంపాదించుకుంటుందని…. క్రికెట్ తర్వాత అంత ఖరీదైన క్రీడ గోల్ఫ్ అని పేర్కొన్నారు. గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా చైర్మన్ కపిల్ దేవ్ త్వరలో ఐపీఎల్ తరహాలోనే… గోల్ఫ్ ప్రీమియర్ లీగ్ను ప్రారంభించబోతున్నట్టు తెలిపారు. గోల్ఫ్ ప్రీమియర్ లీగ్లో ఏపీ నుంచి ఒక జట్టు ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపాడు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







