ఏపీ సీఎంతో కపిల్ దేవ్ భేటీ.. గోల్ఫ్ కోర్స్ ఏర్పాటు పై చర్చ!
- October 29, 2024
అమరావతి: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, గోల్ప్ టూర్ ఆప్ ఇండియా చైర్మన్ కపిల్ దేవ్ ఉండవల్లిలో సీఎం చంద్రబాబును ఆయన నివాసంలో మంగళవారం కలిశారు. కపిల్ దేవ్ కి సీఎం చంద్రబాబు సాదర స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.ఈ భేటీ సందర్భంగా రాష్ట్రంలో గోల్ఫ్ కోర్స్ క్లబ్ ఏర్పాటుపై పలు అంశాలు చర్చలు జరిపారు.
కపిల్ దేవ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో క్రికెట్, గోల్ఫ్ గేమ్స్ కు సంబంధించిన పలు అంశాలతో పాటు వాటి అభివృద్ధికి సంబంధించిన సూచనలపై చర్చించారు. వాటిపై సీఎం చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారు. అమరావతిలో అంతర్జాతీయ గోల్ఫ్ కోర్స్ క్లబ్, అనంతపురం, వైజాగ్లలో ప్రీమియర్ గోల్ఫ్ కోర్స్ క్లబ్లను ఏర్పాటు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించి, ఆంధ్రప్రదేశ్ క్రీడా రంగాన్ని విస్తరించాలని అన్నారు.
విదేశాల్లో బాగా ప్రాచుర్యం పొందిన గోల్ఫ్ ఇప్పుడిప్పుడే మన దేశంలో ప్రాచుర్యం సంపాదించుకుంటుందని…. క్రికెట్ తర్వాత అంత ఖరీదైన క్రీడ గోల్ఫ్ అని పేర్కొన్నారు. గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా చైర్మన్ కపిల్ దేవ్ త్వరలో ఐపీఎల్ తరహాలోనే… గోల్ఫ్ ప్రీమియర్ లీగ్ను ప్రారంభించబోతున్నట్టు తెలిపారు. గోల్ఫ్ ప్రీమియర్ లీగ్లో ఏపీ నుంచి ఒక జట్టు ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపాడు.
తాజా వార్తలు
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!









