తెలంగాణ: రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన హరీశ్
- October 29, 2024
హైదరాబాద్: తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ గా ఎస్ హరీష్ బాధ్యతలు స్వీకరించారు.ప్రస్తుత ఐ అండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్ ఎం.హనుమంతరావ్ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో ఎస్.హరీశ్ ను స్పెషల్ కమిషనర్ గా ప్రభుత్వం నియమించింది.ఇది వరకు హరీశ్ రెవెన్యూ జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వర్తించారు.తాజాగా ప్రభుత్వం 13 మంది ఐఏఎస్ లను ట్రాన్స్ ఫర్ చేసింది.ఈ క్రమంలో ఎస్.హరీశ్ ను ఐ అండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్ గా బదిలీ చేసింది. అదనంగా రెవెన్యూ శాఖ జాయింట్ సెక్రటరీ బాధ్యతలు అప్పగించింది.ఈ సందర్భంగా హరీశ్ కు సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు, సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









