తెలంగాణ: రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన హరీశ్
- October 29, 2024
హైదరాబాద్: తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ గా ఎస్ హరీష్ బాధ్యతలు స్వీకరించారు.ప్రస్తుత ఐ అండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్ ఎం.హనుమంతరావ్ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో ఎస్.హరీశ్ ను స్పెషల్ కమిషనర్ గా ప్రభుత్వం నియమించింది.ఇది వరకు హరీశ్ రెవెన్యూ జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వర్తించారు.తాజాగా ప్రభుత్వం 13 మంది ఐఏఎస్ లను ట్రాన్స్ ఫర్ చేసింది.ఈ క్రమంలో ఎస్.హరీశ్ ను ఐ అండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్ గా బదిలీ చేసింది. అదనంగా రెవెన్యూ శాఖ జాయింట్ సెక్రటరీ బాధ్యతలు అప్పగించింది.ఈ సందర్భంగా హరీశ్ కు సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు, సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







