తెలంగాణ: రాష్ట్ర స‌మాచార శాఖ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన హరీశ్

- October 29, 2024 , by Maagulf
తెలంగాణ: రాష్ట్ర స‌మాచార శాఖ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన హరీశ్

హైద‌రాబాద్: తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ గా ఎస్ హరీష్ బాధ్యతలు స్వీకరించారు.ప్రస్తుత ఐ అండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్ ఎం.హనుమంతరావ్ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో ఎస్.హరీశ్ ను స్పెషల్ కమిషనర్ గా ప్రభుత్వం నియమించింది.ఇది వరకు హ‌రీశ్ రెవెన్యూ జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వర్తించారు.తాజాగా ప్రభుత్వం 13 మంది ఐఏఎస్ లను ట్రాన్స్ ఫర్ చేసింది.ఈ క్రమంలో ఎస్.హరీశ్ ను ఐ అండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్ గా బదిలీ చేసింది. అదనంగా రెవెన్యూ శాఖ జాయింట్ సెక్రటరీ బాధ్యతలు అప్పగించింది.ఈ సందర్భంగా హరీశ్ కు సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు, సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com