గోల్ఫ్ ఆడుతున్న జగన్
- June 23, 2016
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. నిత్యం ఓదార్పు యాత్రలు, నిరాహార దీక్షలు, ప్రజా సమస్యల పైన ఉద్యమాలతో బీజీగా ఉండే జగన్ ఇప్పుడు కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఆయన తన కుటుంబంతో సహా ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్లారు. విదేశీ పర్యటనలో భాగంగా జగన్ కుటుంబం బుధవారం నాడు ఈడెన్ బర్గ్ చేరుకుంది. జగన్ ఆటవిడుపుగా గోల్ఫ్ ఆడారు. పది రోజుల పాటు సాగే ఈ పర్యటనలో ఏడు రోజుల పాటు యూకేలో, మూడు రోజులు ఐర్లాండ్, స్కాట్లాండ్లో గడుపుతున్నారు.
జగన్ పది రోజుల పర్యటనలో భాగంగా జూన్ 16వ తేదీ ఉదయం కుటుంబ సభ్యులతో బయలుదేరి ఇంగ్లాండ్ వెళ్లారు. జగన్ తన సతీమణి భారతి, ఇద్దరు పిల్లలతో కలిసి పర్యటనకు వెళ్లారు. చాలా రోజుల తర్వాత జగన్ పూర్తిస్థాయిలో కుటుంబంతో కలిసి పర్యటనకు వెళ్లారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







