కోర్టు కేసులు ఉన్న ఓవర్స్టేయర్లు వీసా మాఫీ పొందవచ్చా..!
- November 02, 2024
యూఏఈ: ప్రస్తుతం కొనసాగుతున్న చట్టపరమైన సమస్యలతో ఎక్కువ కాలం ఉంటున్న వ్యక్తులను వారి కోర్టు కేసులను పరిష్కరించే ముందు వారి నివాస స్థితిని క్రమబద్ధీకరించడంపై దృష్టి పెట్టాలని సామాజిక కార్యకర్తలు, ఇమ్మిగ్రేషన్ నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు. చట్టపరమైన ప్రక్రియ కొనసాగుతున్న వీసా క్షమాభిక్ష నుండి ప్రయోజనం పొందవచ్చని వారు చెప్పారు. షార్జాలోని సామాజిక కార్యకర్త అబ్దుల్లా కమ్మంపాలెం మాట్లాడుతూ.. కొంతమంది కొనసాగుతున్న కేసుల కారణంగా వారు అర్హత పొందలేదనే అపోహ కారణంగా క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేయడంలో ఆలస్యం చేశారని అన్నారు. వారిలో చాలా మంది ఇప్పటికీ తమ స్టేటస్ను క్రమబద్ధీకరించలేదని, మరికొందరు చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్లను కలిగి లేనందున అప్లై చేయలేకపోయారని వివరించాడు. ఇమ్మిగ్రేషన్ సిస్టమ్లో వేలిముద్ర రికార్డులు లేకపోవడం వల్ల, ముఖ్యంగా విజిట్ వీసాలపై ప్రవేశించిన వారికి క్షమాభిక్ష ప్రారంభ రోజులలో కొంత మంది సందర్శకులు ఆలస్యాన్ని ఎదుర్కొన్నారని ఇమ్మిగ్రేషన్ నిపుణులు గుర్తించారు. సిస్టమ్లో వేలిముద్రలు లేని సందర్శకులు తమ స్థితిని క్రమబద్ధీకరించుకోవడానికి అల్ అవిర్లోని GDRFA టెంట్కి వెళ్లవలసి ఉంటుందని పేర్కొన్నారు. వీసా క్షమాభిక్ష కార్యక్రమం అక్టోబర్ 31న ముగియాల్సి ఉంది. కానీ డిసెంబర్ 31 వరకు పొడిగించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల