డిసెంబర్ వరకు స్వచ్ఛంద చమురు కోతలను పొడిగించిన ఒపెక్ దేశాలు..!!
- November 04, 2024
రియాద్: సౌదీ అరేబియాతోపాటు ఏడు ఇతర ఒపెక్ + దేశాలు డిసెంబరు 2024 చివరి వరకు రోజుకు 2.2 మిలియన్ బ్యారెల్స్ (బిపిడి) అదనపు చమురు స్వచ్ఛంద కోతలను మరో నెల పాటు పొడిగించాలని నిర్ణయించాయి. సౌదీ అరేబియా, రష్యా, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, కజకిస్తాన్, అల్జీరియా, ఒమన్ ఒపెక్ దేశాలు నవంబర్ 2023లో ప్రకటించిన స్వచ్ఛంద చమురు కొతకు 2.2 మిలియన్ బిపిడి పొడిగించడానికి అంగీకరించాయని ఒపెక్ సెక్రటేరియట్ ఒక ప్రకటనలో తెలిపింది. 3 ఏప్రిల్ 2024న జరిగిన దాని 53వ సమావేశంలో జాయింట్ మినిస్టీరియల్ మానిటరింగ్ కమిటీ అదనపు స్వచ్ఛంద చమురు ఉత్పత్తి సర్దుబాట్లను కొనసాగించాలని నిర్ణయించింది. ఆగస్టులో సౌదీ అరేబియా, రష్యా, యూఏఈ, కువైట్, అల్జీరియా, ఒమన్, ఇరాక్, కజకిస్తాన్ లు రెండు దఫాలుగా చర్చలు జరిపాయి.
తాజా వార్తలు
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!









