డిసెంబర్ వరకు స్వచ్ఛంద చమురు కోతలను పొడిగించిన ఒపెక్ దేశాలు..!!
- November 04, 2024
రియాద్: సౌదీ అరేబియాతోపాటు ఏడు ఇతర ఒపెక్ + దేశాలు డిసెంబరు 2024 చివరి వరకు రోజుకు 2.2 మిలియన్ బ్యారెల్స్ (బిపిడి) అదనపు చమురు స్వచ్ఛంద కోతలను మరో నెల పాటు పొడిగించాలని నిర్ణయించాయి. సౌదీ అరేబియా, రష్యా, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, కజకిస్తాన్, అల్జీరియా, ఒమన్ ఒపెక్ దేశాలు నవంబర్ 2023లో ప్రకటించిన స్వచ్ఛంద చమురు కొతకు 2.2 మిలియన్ బిపిడి పొడిగించడానికి అంగీకరించాయని ఒపెక్ సెక్రటేరియట్ ఒక ప్రకటనలో తెలిపింది. 3 ఏప్రిల్ 2024న జరిగిన దాని 53వ సమావేశంలో జాయింట్ మినిస్టీరియల్ మానిటరింగ్ కమిటీ అదనపు స్వచ్ఛంద చమురు ఉత్పత్తి సర్దుబాట్లను కొనసాగించాలని నిర్ణయించింది. ఆగస్టులో సౌదీ అరేబియా, రష్యా, యూఏఈ, కువైట్, అల్జీరియా, ఒమన్, ఇరాక్, కజకిస్తాన్ లు రెండు దఫాలుగా చర్చలు జరిపాయి.
తాజా వార్తలు
- దోహా ఫోరం 2025: QR2.016 బిలియన్ల విలువైన ఒప్పందాలు..!!
- అల్-రాయ్లో ఇద్దరు కార్మికులు మృతి..!!
- యునెస్కో జాబితాలో ఒమన్ 'బిష్ట్' రిజిస్టర్..!!
- బహ్రెయిన్ లో నేషనల్ డే ,యాక్సెషన్ డే సెలవులు అనౌన్స్..!!
- అల్ రీమ్ ద్వీపంలోని భవనంలో అగ్నిప్రమాదం..!!
- సౌదీ అరేబియాలో చల్లబడ్డ వాతావరణం..!!
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!







