డిసెంబర్ వరకు స్వచ్ఛంద చమురు కోతలను పొడిగించిన ఒపెక్ దేశాలు..!!
- November 04, 2024
రియాద్: సౌదీ అరేబియాతోపాటు ఏడు ఇతర ఒపెక్ + దేశాలు డిసెంబరు 2024 చివరి వరకు రోజుకు 2.2 మిలియన్ బ్యారెల్స్ (బిపిడి) అదనపు చమురు స్వచ్ఛంద కోతలను మరో నెల పాటు పొడిగించాలని నిర్ణయించాయి. సౌదీ అరేబియా, రష్యా, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, కజకిస్తాన్, అల్జీరియా, ఒమన్ ఒపెక్ దేశాలు నవంబర్ 2023లో ప్రకటించిన స్వచ్ఛంద చమురు కొతకు 2.2 మిలియన్ బిపిడి పొడిగించడానికి అంగీకరించాయని ఒపెక్ సెక్రటేరియట్ ఒక ప్రకటనలో తెలిపింది. 3 ఏప్రిల్ 2024న జరిగిన దాని 53వ సమావేశంలో జాయింట్ మినిస్టీరియల్ మానిటరింగ్ కమిటీ అదనపు స్వచ్ఛంద చమురు ఉత్పత్తి సర్దుబాట్లను కొనసాగించాలని నిర్ణయించింది. ఆగస్టులో సౌదీ అరేబియా, రష్యా, యూఏఈ, కువైట్, అల్జీరియా, ఒమన్, ఇరాక్, కజకిస్తాన్ లు రెండు దఫాలుగా చర్చలు జరిపాయి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







