నవంబర్ 15 నుండి కువైట్ స్ప్రింగ్ క్యాంప్స్.. ఉల్లంఘనలకు KD5,000 జరిమానా..!!
- November 05, 2024
కువైట్: మునిసిపల్ కౌన్సిల్ లీగల్, ఫైనాన్షియల్ కమిటీ సీజనల్ స్ప్రింగ్ క్యాంపుల బైలా ఏర్పాటును ఖరారు చేసింది. స్ప్రింగ్ క్యాంపులు ప్రతి సంవత్సరం నవంబర్ 15 నుండి మార్చి 15 వరకు ప్రారంభమవుతాయి. సరైన అనుమతులు లేకుండా క్యాంపింగ్ నిబంధనలను ఉల్లంఘించిన లేదా శీతాకాలపు శిబిరాలను ఏర్పాటు చేసిన వారికి 3,000 నుండి 5,000 దీనార్ల జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు. మునిసిపల్ కమిటీ క్యాంపింగ్ నియమాలను వెల్లడించింది. చిన్న, మధ్యస్థ వ్యాపారాలు, అలాగే రెస్టారెంట్ కేఫ్ రంగాలలోని కంపెనీలు కూడా క్యాంపింగ్ ప్రాంతంలో నిర్దిష్ట ప్రదేశాలలో ఏర్పాటుకు అనుమతిస్తారు. స్ప్రింగ్ క్యాంప్స్ కమిటీ ఎంపిక చేసిన ప్రదేశాలలో కూడా తాత్కాలిక ప్రదర్శనలు నిర్వహించుకోవచ్చు. క్యాంప్ నిబంధనల ప్రకారం..వాణిజ్య మంత్రిత్వ శాఖ లైసెన్స్ పొందిన కాఫీ దుకాణాలు, జ్యూస్లు, రిఫ్రెష్మెంట్లు, స్నాక్స్ స్టాల్స్ స్ప్రింగ్కు అనుగుణంగా కువైట్ మునిసిపాలిటీ పేర్కొన్న ప్రదేశాలలో కార్యకలాపాలను నిర్వహించుకోవడానికి అనుమతించనున్నారు. మరింత సమాచారం కోసం మునిసిపల్ అధికారులను సంప్రదించాలని సూచించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజలు తరలింపు
- లోక్సభ స్పీకర్ పై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం..
- టీమ్ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా..
- సౌదీ రక్షణ దళాల చర్య: బాలిస్టిక్ క్షిపణి, రెండు డ్రోన్లు నిర్వీర్యం
- గ్యాస్ వినియోగదారులకు షాక్
- విదేశాల్లో ఇరానీయులకు హెచ్చరిక, దేశద్రోహం చేస్తే మరణశిక్ష
- రాత్రి సమయంలో ఎమర్జెన్సీ అలర్ట్ సౌండ్ లో మార్పు
- అబుదాబి నుండి భారత్కు ఎతిహాద్ విమానాలు–నేటి షెడ్యూల్
- మనామాలో నివాస భవనం పై ఇరాన్ దాడి: ఒకరు మృతి, పలువురికి గాయాలు
- కమ్యూనిటీ వర్చువల్ సమావేశం నిర్వహించిన భారత రాయబారి..!!









