11లక్షలమంది పేద ముస్లింలకు చంద్రన్న రంజాన్‌ తోఫా

- June 24, 2016 , by Maagulf
11లక్షలమంది పేద ముస్లింలకు చంద్రన్న రంజాన్‌ తోఫా

రంజాన్ సందర్భంగా రూ.51కోట్లతో 11లక్షలమంది పేద ముస్లింలకు చంద్రన్న రంజాన్‌ తోఫాను సీఎం ప్రారంభించనున్నట్లు మంత్రి పల్లె రఘునాథరెడ్డి వెల్లడించారు. గురువారం మంత్రి పల్లె మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు గురువారం సాయంత్రం గుంటూరులో ముస్లిమ్ ప్రముఖులకు ఇఫ్తార్‌ విందు ఇస్తారని మంత్రి పేర్కొన్నారు. ఏపీలో 2,500మంది ఇమామ్‌లకు నెలకు రూ.5వేల వేతనం, మౌజమ్‌లకు రూ.3వేల వేతనం ఇస్తామని మంత్రి పల్లె రఘునాథరెడ్డి వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com