నవంబర్ 10న దుబాయ్ మెట్రో సమయాలు పొడిగింపు..!!
- November 09, 2024
దుబాయ్: దుబాయ్ మెట్రో రెడ్ లైన్, గ్రీన్ లైన్ మెట్రో సమయాలను నవంబర్ 10 వరకు పొడించారు. తెల్లవారుజామున 3.00 నుండి ఉదయం 12 గంటల వరకు పనిచేస్తాయని దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ప్రకటించింది. దుబాయ్ రైడ్లో పాల్గొనే వ్యక్తుల కోసం మెట్రో సమయాలను పొడిగించినట్లు తెలిపారు. దుబాయ్ రైడ్ లో భాగంగా అతిపెద్ద కమ్యూనిటీ సైక్లింగ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. దుబాయ్ రైడ్ మార్గాలు ఉదయం 5 గంటలకు ప్రజలకు ఓపెన్ గా ఉంటాయి. సైక్లిస్టులు తమ ప్రయాణాన్ని ఉదయం 6.15 గంటలకు ప్రారంభించి ఉదయం 8 గంటలకు ముగిస్తారు. బైక్-షేరింగ్ కంపెనీ కరీమ్ ఈవెంట్లో పాల్గొనే నివాసితులు, పర్యాటకులకు ఉచితంగా బైకులను అందజేస్తామని ప్రకటించింది.
తాజా వార్తలు
- నేటి నుంచి గుణదల మేరీమాత ఉత్సవాలు
- ఖతార్ లో వెయ్యి వస్తువుల ధరలు తగ్గింపు..!!
- మస్కట్ లో INSV కౌండిన్యకు ఘనంగా వీడ్కోలు..!!
- 2025లో సౌదీలో రెమిటెన్స్ రికార్డు..15శాతం వృద్ధి..!!
- ట్రాఫిక్ కు చెక్..అల్ ఖుద్రాలో కొత్త 4-లేన్ల బ్రిడ్జి ప్రారంభం..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో అగ్నిప్రమాదం..తప్పిన పెనుప్రమాదం..!!
- ఫహాహీల్ ఎక్స్ ప్రెస్వే ఫాస్ట్ లేన్ 15 రోజుల పాటు మూసివేత..!!
- పోస్టాఫీస్లో అద్భుతమైన స్కీమ్..
- నోబెల్ గ్రహీత నర్గెస్కు మరో ఏడున్నరేళ్ల జైలు
- భారత దేశంలో తొలి సమగ్ర అవయవ మార్పిడి సంస్థ









