‘సీ ప్లేన్’ ఆపరేషన్స్ ఏపీ రూపురేఖలను మార్చుతాయి: మంత్రి రామ్మోహన్
- November 09, 2024
న్యూ ఢిల్లీ: విజయవాడ-శ్రీశైలం ‘సీ ప్లేన్’పై విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పలు వివరాలు తెలిపారు. ఇవాళ జరుగుతున్న సీ ప్లేన్ ఆపరేషన్స్ ఏపీ రూపురేఖలు మార్చడమే కాకుండా దేశ రూపు రేఖలు మార్చనుందని తెలిపారు.
గుజరాత్లో మొదలు పెట్టినప్పుడు కొన్ని సమస్యలు వచ్చాయని చెప్పారు. చంద్రబాబు గైడ్ లైన్స్ తో సీ ప్లేన్స్ తీసుకొస్తున్నామని తెలిపారు. చంద్రబాబు ఇచ్చిన మార్గ దర్శకత్వంలో ఏ చాలెంజ్ వచ్చినా ముందుకు వెళుతున్నామని చెప్పారు.
అమరావతిలోనే సీ ప్లేన్స్కు ముందడుగు పడుతోందని తెలిపారు. ఉడాన్ స్కీంలోనికి సీ ప్లేన్స్ తీసుకొచ్చినట్లు చెప్పారు.కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏ సహకారం కోరినా అంగీకరిస్తామని తెలిపారు.
మంచి వాటర్ బాడీ, నదులువున్నా.. సీప్లేన్ ఏర్పాటు చేస్తామని అన్నారు.డెమో రూట్ కింద ఈ రోజు విజయవాడ నుంచి శ్రీశైలానికి రూట్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.నూతన ఎయిర్ పోర్టులకు కూడా సహకారం అందిస్తామని చెప్పారు.
తాజా వార్తలు
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం
- కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్
- యూఏఈలో పాఠశాలలకు 9 రోజుల ఈద్ అల్ అధా సెలవులు
- కార్మికులకు సీఎం రేవంత్ మేడే శుభాకాంక్షలు
- 2027 మార్చి 31 నాటికి తెలంగాణ నుంచి 1,000 వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యం
- IPL 2026: బెంగళూరు పై గుజరాత్ ఘనవిజయం!
- మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్
- గల్ఫ్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్









