ఏపీలో మరో ఉపఎన్నిక-ఈసీ నోటిఫికేషన్ విడుదల..!
- November 11, 2024
ఏపీలో మరో ఉపఎన్నిక కోసం ఎన్నికల సంఘం ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే రాష్ట్రంలోని శాసనమండలిలో ఖాళీ అయిన స్థానిక సంస్థల, టీచర్స్ ఎమ్మెల్సీ స్ధానాల కోసం నోటిఫికేషన్ విడుదల అయింది.
ఇప్పుడు మరో స్ధానంలో జరగాల్సిన ఉపఎన్నిక కోసం ఎన్నికల సంఘం ఇవాళ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో వచ్చే నెలలో ఈ ఉపఎన్నికల జరగబోతోంది.
రాష్ట్రంలో గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీగా ఉన్న షేక్ సాబ్జీ హఠాన్మరణం కారణంగా ఈ స్ధానం ఖాళీగా ఉంది. దీంతో ఈ ఎమ్మెల్సీ సీటుకు ఉపఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసింది. గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ స్ధానానికి జరిగే ఉపఎన్నిక కోసం ఇవాళ్టి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 18 వరకూ నామినేషన్ల స్వీకరణ ఉంటుంది.
అనంతరం ఈ నెల 19న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 21 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. డిసెంబర్ 5న గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ స్ధానానికి ఉపఎన్నిక నిర్వహిస్తారు. అనంతరం అదే రోజు ఓట్లు లెక్కించి ఫలితం విడుదల చేస్తారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ ఉంటుందని ఈసీ నోటిఫికేషన్ లో పేర్కొంది. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ టీచర్ల విషయంలో అనుసరిస్తున్న వైఖరిపై వారు ఇందులో తీర్పు ఇవ్వబోతున్నారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







