ఏపీలో మరో ఉపఎన్నిక-ఈసీ నోటిఫికేషన్ విడుదల..!
- November 11, 2024
ఏపీలో మరో ఉపఎన్నిక కోసం ఎన్నికల సంఘం ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే రాష్ట్రంలోని శాసనమండలిలో ఖాళీ అయిన స్థానిక సంస్థల, టీచర్స్ ఎమ్మెల్సీ స్ధానాల కోసం నోటిఫికేషన్ విడుదల అయింది.
ఇప్పుడు మరో స్ధానంలో జరగాల్సిన ఉపఎన్నిక కోసం ఎన్నికల సంఘం ఇవాళ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో వచ్చే నెలలో ఈ ఉపఎన్నికల జరగబోతోంది.
రాష్ట్రంలో గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీగా ఉన్న షేక్ సాబ్జీ హఠాన్మరణం కారణంగా ఈ స్ధానం ఖాళీగా ఉంది. దీంతో ఈ ఎమ్మెల్సీ సీటుకు ఉపఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసింది. గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ స్ధానానికి జరిగే ఉపఎన్నిక కోసం ఇవాళ్టి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 18 వరకూ నామినేషన్ల స్వీకరణ ఉంటుంది.
అనంతరం ఈ నెల 19న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 21 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. డిసెంబర్ 5న గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ స్ధానానికి ఉపఎన్నిక నిర్వహిస్తారు. అనంతరం అదే రోజు ఓట్లు లెక్కించి ఫలితం విడుదల చేస్తారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ ఉంటుందని ఈసీ నోటిఫికేషన్ లో పేర్కొంది. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ టీచర్ల విషయంలో అనుసరిస్తున్న వైఖరిపై వారు ఇందులో తీర్పు ఇవ్వబోతున్నారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







