బహ్రెయిన్లో పెరుగుతున్న లేబర్ ఫిర్యాదులు..!!
- November 12, 2024
మనామా: బహ్రెయిన్ లో క్రమంగా లేబర్ ఫిర్యాదులు పెరుగుతున్నాయి. జనరల్ ఫెడరేషన్ ఆఫ్ బహ్రెయిన్ ట్రేడ్ యూనియన్స్ యొక్క ప్రైవేట్ సెక్టార్ సెక్రటేరియట్లోని మానిటరింగ్ కమిటీ సెప్టెంబర్ 2024లో మొత్తం 29 లేబర్ ఫిర్యాదులు నమోదయ్యాయి. అదే సమయంలో హెల్ప్, సలహాల కోసం 63 అభ్యర్థనలను నమోదు చేసింది. మొత్తంగా గత తొమ్మిది నెలల్లో నమోదైన ఫిర్యాదుల సంఖ్య 294కు పెరిగింది. సెప్టెంబర్ నెలకు సంబంధించి 21 మంది మేల్ కార్మికులు, 8 మంది మహిళా కార్మికుల నుండి ఫిర్యాదులు వచ్చాయని, కార్మిక హక్కులకు సంబంధించిన సమస్యలపై దృష్టి సారించినట్టు మానిటరింగ్ కమిటీ వెల్లడించింది.
14 ఫిర్యాదులు కార్మిక హక్కులు, తొలగింపుతో ముడిపడి ఉన్నాయని, 10 తప్పుడు తొలగింపులుగా కార్మికులు ఫిర్యాదు చేశారని తెలిపారు. దీంతోపాటు సస్పెండ్ చేయబడిన ఒక కార్మికునికి సంబంధించిన ఒక కేసు, పునర్నిర్మాణం లేదా పూర్తి/పాక్షిక మూసివేతలకు సంబంధించిన మూడు కేసులు విచారణ దశలో ఉన్నాయన్నారు. హెల్త్కేర్ పరిశ్రమ నుండి అత్యధికంగా 10 ఫిర్యాదులు రాగా, నిర్మాణ రంగం 7, వాణిజ్య రంగం 5, పారిశ్రామిక, పర్యాటక రంగం, విద్య, రవాణా, సేవలు మరియు టెలికమ్యూనికేషన్ నుండి ఒక్కో ఫిర్యాదు వచ్చాయని పేర్కొన్నారు. జనరల్ ఫెడరేషన్ ఆఫ్ బహ్రెయిన్ ట్రేడ్ యూనియన్కు ఏప్రిల్లో అత్యధికంగా 176 ఫిర్యాదులు, సెప్టెంబర్లో 29, మేలో 24, జూన్లో 14 ఫిర్యాదులు నమోదయ్యాయని తెలిపారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







