బహ్రెయిన్లో పెరుగుతున్న లేబర్ ఫిర్యాదులు..!!
- November 12, 2024
మనామా: బహ్రెయిన్ లో క్రమంగా లేబర్ ఫిర్యాదులు పెరుగుతున్నాయి. జనరల్ ఫెడరేషన్ ఆఫ్ బహ్రెయిన్ ట్రేడ్ యూనియన్స్ యొక్క ప్రైవేట్ సెక్టార్ సెక్రటేరియట్లోని మానిటరింగ్ కమిటీ సెప్టెంబర్ 2024లో మొత్తం 29 లేబర్ ఫిర్యాదులు నమోదయ్యాయి. అదే సమయంలో హెల్ప్, సలహాల కోసం 63 అభ్యర్థనలను నమోదు చేసింది. మొత్తంగా గత తొమ్మిది నెలల్లో నమోదైన ఫిర్యాదుల సంఖ్య 294కు పెరిగింది. సెప్టెంబర్ నెలకు సంబంధించి 21 మంది మేల్ కార్మికులు, 8 మంది మహిళా కార్మికుల నుండి ఫిర్యాదులు వచ్చాయని, కార్మిక హక్కులకు సంబంధించిన సమస్యలపై దృష్టి సారించినట్టు మానిటరింగ్ కమిటీ వెల్లడించింది.
14 ఫిర్యాదులు కార్మిక హక్కులు, తొలగింపుతో ముడిపడి ఉన్నాయని, 10 తప్పుడు తొలగింపులుగా కార్మికులు ఫిర్యాదు చేశారని తెలిపారు. దీంతోపాటు సస్పెండ్ చేయబడిన ఒక కార్మికునికి సంబంధించిన ఒక కేసు, పునర్నిర్మాణం లేదా పూర్తి/పాక్షిక మూసివేతలకు సంబంధించిన మూడు కేసులు విచారణ దశలో ఉన్నాయన్నారు. హెల్త్కేర్ పరిశ్రమ నుండి అత్యధికంగా 10 ఫిర్యాదులు రాగా, నిర్మాణ రంగం 7, వాణిజ్య రంగం 5, పారిశ్రామిక, పర్యాటక రంగం, విద్య, రవాణా, సేవలు మరియు టెలికమ్యూనికేషన్ నుండి ఒక్కో ఫిర్యాదు వచ్చాయని పేర్కొన్నారు. జనరల్ ఫెడరేషన్ ఆఫ్ బహ్రెయిన్ ట్రేడ్ యూనియన్కు ఏప్రిల్లో అత్యధికంగా 176 ఫిర్యాదులు, సెప్టెంబర్లో 29, మేలో 24, జూన్లో 14 ఫిర్యాదులు నమోదయ్యాయని తెలిపారు.
తాజా వార్తలు
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!







