రహమాన్ మ్యూజిక్..కోహ్లీ పాట
- June 24, 2016
మైదానంలో తనదైన స్పీడుతో దూసుకెళ్లే టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ సింగర్ అవతారమెత్తారు. ప్రీమియర్ ఫుట్సల్ లీగ్ కోసం ఆంథమ్ సాంగ్ ను విరాట్ కోహ్లీ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహహాన్ సంగీత సారథ్యంలో స్వయంగా ఆలపించారు. చెన్నైలోని ఏఆర్ రహమాన్ స్టూడియోలో తాను పాట పాడుతున్న ఫొటోను ట్విట్టర్ లో అభిమానులతో షేర్ చేసుకున్నాడు కోహ్లీ. ఏఆర్ రెహమాన్ గారికి నేను వీరాభిమానిని. ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో ఆంథమ్ సాంగ్కు నా గొంతు ఇవ్వడం గొప్ప, అరుదైన అవకాశంగా భావిస్తున్నానంటూ కోహ్లీ సంతోషాన్ని షేర్ చేసుకున్నారు. కోహ్లీ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









