చంద్రుడి పై జెండా పాతనున్న బహ్రెయిన్..!
- November 15, 2024
యూఏఈ: యూఏఈ మొహమ్మద్ బిన్ రషీద్ స్పేస్ సెంటర్ భాగస్వామ్యంతో చారిత్రాత్మక చంద్రుడిపై ల్యాండింగ్ చేయడానికి బహ్రెయిన్ నేషనల్ స్పేస్ సైన్స్ ఏజెన్సీ సిద్ధమవుతుంది. నేషనల్ స్పేస్ సైన్స్ ఏజెన్సీ (NSSA) తన మొదటి పేలోడ్ను చంద్రునిపైకి పంపుతున్నట్లు ప్రకటించింది. ఈ మైలురాయి మిషన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొహమ్మద్ బిన్ రషీద్ స్పేస్ సెంటర్ (MBRSC) సహకారంతో ఎమిరేట్స్ లూనార్ మిషన్లో భాగంగా ఉంది. ఇది అంతరిక్ష అన్వేషణ, సాంకేతిక పురోగతి కోసం అరబ్ ఇంట్రస్ట్ ను తెలియజేయనుంది. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్షో 2024లో ఈ మేరకు ప్రకటించారు.
బహ్రెయిన్ NSSA చే అభివృద్ధి చేయబడిన హై-టెక్ నావిగేషన్ కెమెరాలను చంద్రుని వాతావరణాన్ని తట్టుకునేలా రూపొందించారు. ఈ కెమెరాలు రోవర్ నావిగేషన్లో కీలక పాత్ర పోషిస్తాయి. చంద్రుడి ఉపరితలాన్ని మ్యాప్ చేయడానికి, మట్టి నమూనాలను విశ్లేషించడానికి, రోవర్ కదలికను పర్యవేక్షించడానికి తోడ్పాటు అందిస్తాయని NSSA సీఈఓ డా. మొహమ్మద్ ఇబ్రహీం అల్-అసీరి తెలిపారు. "ఈ మిషన్ బహ్రెయిన్ వర్క్ఫోర్స్లోని ఉన్నత స్థాయి నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో సహకారం అందించడానికి మా ఇంజనీర్ల సంసిద్ధతను ప్రదర్శిస్తుంది" అని డాక్టర్ అల్-అసీరి వ్యాఖ్యానించారు. బహ్రెయిన్ చంద్రునిపై తనదైన ముద్ర వేయడానికి సిద్ధంగా ఉన్నందున, NSSA-MBRSC సహకారం రెండు దేశాలకు ఒక మైలురాయిని మాత్రమే కాకుండా ప్రపంచ చంద్రుడి పరిశోధనకు సహకారాన్ని అందిస్తుందని MBRSC డైరెక్టర్ జనరల్ సేలం హుమైద్ అల్మర్రి వెల్లడించారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









