చంద్రుడి పై జెండా పాతనున్న బహ్రెయిన్..!
- November 15, 2024
యూఏఈ: యూఏఈ మొహమ్మద్ బిన్ రషీద్ స్పేస్ సెంటర్ భాగస్వామ్యంతో చారిత్రాత్మక చంద్రుడిపై ల్యాండింగ్ చేయడానికి బహ్రెయిన్ నేషనల్ స్పేస్ సైన్స్ ఏజెన్సీ సిద్ధమవుతుంది. నేషనల్ స్పేస్ సైన్స్ ఏజెన్సీ (NSSA) తన మొదటి పేలోడ్ను చంద్రునిపైకి పంపుతున్నట్లు ప్రకటించింది. ఈ మైలురాయి మిషన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొహమ్మద్ బిన్ రషీద్ స్పేస్ సెంటర్ (MBRSC) సహకారంతో ఎమిరేట్స్ లూనార్ మిషన్లో భాగంగా ఉంది. ఇది అంతరిక్ష అన్వేషణ, సాంకేతిక పురోగతి కోసం అరబ్ ఇంట్రస్ట్ ను తెలియజేయనుంది. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్షో 2024లో ఈ మేరకు ప్రకటించారు.
బహ్రెయిన్ NSSA చే అభివృద్ధి చేయబడిన హై-టెక్ నావిగేషన్ కెమెరాలను చంద్రుని వాతావరణాన్ని తట్టుకునేలా రూపొందించారు. ఈ కెమెరాలు రోవర్ నావిగేషన్లో కీలక పాత్ర పోషిస్తాయి. చంద్రుడి ఉపరితలాన్ని మ్యాప్ చేయడానికి, మట్టి నమూనాలను విశ్లేషించడానికి, రోవర్ కదలికను పర్యవేక్షించడానికి తోడ్పాటు అందిస్తాయని NSSA సీఈఓ డా. మొహమ్మద్ ఇబ్రహీం అల్-అసీరి తెలిపారు. "ఈ మిషన్ బహ్రెయిన్ వర్క్ఫోర్స్లోని ఉన్నత స్థాయి నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో సహకారం అందించడానికి మా ఇంజనీర్ల సంసిద్ధతను ప్రదర్శిస్తుంది" అని డాక్టర్ అల్-అసీరి వ్యాఖ్యానించారు. బహ్రెయిన్ చంద్రునిపై తనదైన ముద్ర వేయడానికి సిద్ధంగా ఉన్నందున, NSSA-MBRSC సహకారం రెండు దేశాలకు ఒక మైలురాయిని మాత్రమే కాకుండా ప్రపంచ చంద్రుడి పరిశోధనకు సహకారాన్ని అందిస్తుందని MBRSC డైరెక్టర్ జనరల్ సేలం హుమైద్ అల్మర్రి వెల్లడించారు.
తాజా వార్తలు
- మెట్రోలింక్ బస్సు మార్గం M304లో మార్పులు..!!
- ఇంధన రంగంపై బహ్రెయిన్–థాయ్లాండ్ చర్చలు..!!
- తల్లిచేతిలో కత్తిపోట్లకు గురైన చిన్నారులు.. పరామర్శించిన కువైట్ మంత్రి..!!
- లైవ్ లో అసభ్యకర కంటెంట్.. మహిళకు ఏడాది జైలు, దేశ బహిష్కరణ..!!
- జెడ్డా పోర్టులో 58.6 కిలోల మెథాంఫెటమైన్ పట్టివేత..!!
- యూఏఈలో ఎండల తీవ్రత.. 50.4°C ఉష్ణోగ్రత నమోదు..!!
- అబుదాబిలో భారతీయ లస్సీ షాప్ తాత్కాలికంగా మూసివేత..!!
- BITS పిలానీ–డైమ్లర్ ట్రక్ ఇన్నోవేషన్ సెంటర్ భాగస్వామ్యం
- అల్ అమరాత్లో ప్రభుత్వ భూముల అక్రమ ఆక్రమణలపై మస్కట్ మున్సిపాలిటీ కొరడా
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..







