ఖతార్ లో పక్షులను 'పిలిచే' పరికరాలు భారీగా సీజ్..!!

- November 20, 2024 , by Maagulf
ఖతార్ లో పక్షులను \'పిలిచే\' పరికరాలు భారీగా సీజ్..!!

దోహా:పర్యావరణ పరిరక్షణకు ఖతార్ పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (MoECC) రంగంలోకి దిగింది.   పక్షులను పిలిచే "సవాయత్" అని కూడా పిలువబడే ఎలక్ట్రానిక్ పరికరాలను పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకుంది. ఆయా పరికరాలను స్వాధీనం చేసుకున్నామని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తన సోషల్ మీడియాలో పేర్కొంది. పక్షులను పిలిచే పరికరాలతో సహా అన్ని పర్యావరణ ఉల్లంఘనలను తనిఖీ చేయడానికి వన్యప్రాణి సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. పర్యావరణ చట్టాలకు అందరూ కట్టుబడి ఉండాలని మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com