ఇండియన్ టూరిస్ట్ మృతి: ఆందోళనలో కుటుంబం
- June 25, 2016
ఓ భారతీయ టూరిస్ట్ దుబాయ్లో మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తికి ట్రావెల్ వీసా కూడా లేకపోవడంతో బాధిత కుటుంబం తీవ్ర ఆందోళన చెందుతోంది. ఆసుపత్రిలో అతనికి వైద్య చికిత్స కోసం 197,000 దిర్హామ్లు చెల్లించాల్సి ఉంది. దంటో 35,000 దిర్హామ్లు వారు చెల్లించగలిగారు. ఆసుపత్రి ఇచ్చిన డిస్కౌంట్ తర్వాత ఇంకా 126,00 దిర్హామ్లు చెల్లించాల్సి ఉంటుంది. ఆసుపత్రి బిల్లు చెల్లించడానికి సహాయం కోరుతున్నారు. చిన్నపాటి అనారోగ్యంతో ఆ వ్యక్తి ఆసుపత్రిలో చేరగా, అతనికి చికిత్స అందించిన వైద్యులు అక్యూట్ నిమోనియాతో బాధపడుతున్నట్లు గుర్తించారు. కుడివైపు లంగ్ పూర్తిగా పనిచేయకపోవడంతో ఆయన్ను వెంటిలేటర్పై ఉంచారు. మృతుడి కుటుంబ సభ్యులు, ఈ పరిస్థితి నుంచి తమను ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. చిన్నపాటి ఆదాయంతో బతుకులీడ్చుతున్న తమకు రాకూడని కష్టం వచ్చిందని వారు ఆవేదన చెందుతున్నారు.
తాజా వార్తలు
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- ఐరా ‘స్పా’ మసాజ్ సెంటర్ లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్!
- బసవతారకం హాస్పిటల్: ఏపీ వాసులకు శుభవార్త..
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ
- కార్పొరేట్ ట్యాక్స్ బిల్లులో లోపాలను ఎత్తిచూపిన పార్లమెంట్ ప్యానెల్..!!









