పాకిస్తాన్: ఉగ్ర నరమేధం..38 మంది దుర్మరణం
- November 21, 2024
పాకిస్తాన్: పాకిస్తాన్లో దారుణం చోటుచేసుకుంది. ఖైబర్ ఫంఖ్తువా ప్రావిన్సులోని కుర్రం జిల్లాలో ప్రయాణికుల వాహనాలపై సాయుధ దుండగులు కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో 38మంది మరణించగా, 29 మంది గాయపడ్డారు. మృతులలో ఆరుగురు మహిళలు, పలువురు చిన్నారులు ఉన్నట్లు పోలీసు అధికారులు ధ్రువీకరించారు. ఇటీవలి నెలల్లో డజన్ల కొద్దీ ప్రాణాలను బలిగొన్న మతపరమైన హింసతో ఈ సంఘటనలు ముడిపడి ఉన్నాయని అధికారులు తెలిపారు.
‘షియా ప్రజల రెండు వేర్వేరు కాన్వాయిలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారని సీనియర్ అడ్మినిస్ట్రేషన్ అధికారి జావేద్ ఉల్లా మెహసూద్ చెప్పారు. రెండు సంఘటనలలో సుమారు 10 మంది దుండగులు పాల్గొన్నట్లు సమాచారం. రెండు కాన్వాయ్లలో దాదాపు 40 వాహనాలు పోలీసు ఎస్కార్ట్లో ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది.
వాయువ్య ఖైబర్ ఫఖ్తువా ప్రావిన్స్లోని కుర్రమ్లో సున్నీ, షియా ముస్లిం తెగలు తరచూ పరస్పర ఘర్షణలకు పాల్పడుతుంటాయి. అక్టోబర్లో జరిగిన మత ఘర్షణలో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు సహా కనీసం 16 మంది చనిపోయారు. జులై, సెప్టెంబరులోనూ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. డజన్ల సంఖ్యలో ప్రజలు చనిపోయారు.
తాజా వార్తలు
- DPIFF 2025 Welcomes Renowned Astrologer Dr. Sohini Sastri as Jury Member for the Prestigious Film Festival
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..







