ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు..
- November 21, 2024
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. తాజాగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్టీపీసీ (నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్) తో రాష్ట్ర ప్రభుత్వం భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఏపీ ప్రభుత్వ భాగస్వామ్యంతో పునరుత్పాదక రంగంలో రూ.1.87 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ నేపథ్యంలో గురువారం ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు లోకేష్, గొట్టిపాటి రవి సమక్షంలో ఒప్పందం కుదిరింది.
ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే 25 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.20,620 కోట్ల ఆదాయం రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా ఎన్టీపీసీ పెట్టే పెట్టుబడులతో 1.06 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు చెప్పాయి.
తాజా వార్తలు
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక







