ఇంజిన్, సౌండ్ సిస్టమ్ లో మార్పులు..12వేల వాహనాలకు జరిమానాలు..!!
- November 23, 2024
యూఏఈ: అధిక శబ్దాలు, ఇంజిన్ లో మార్పులు చేసినందుకు ఈ ఏడాది జనవరి నుండి 12వేల మంది వాహన యజమానులకు దుబాయ్ పోలీసులు జరిమానా విధించారు. అనుమతి లేకుండా వాహనం ఇంజిన్ లేదా ఛాసిస్లో గణనీయమైన మార్పులు చేయడం ఉల్లంఘన కిందకు వస్తుందని పోలీసులు తెలిపారు. సౌండ్, ఇంజిన్ మార్పులు చేసిన వాహనాలను నడపడం తీవ్రమైన ట్రాఫిక్ నేరమని, 2,000 దిర్హామ్ల ట్రాఫిక్ జరిమానాతోపాటు 12 బ్లాక్ పాయింట్లు విధిస్తామని దుబాయ్ పోలీసులు తెలిపారు. అలాగే జప్తు చేయబడిన కార్లను విడుదల చేయడానికి 10,000 దిర్హామ్ల వరకు అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు. దుబాయ్ పోలీస్లోని జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ డైరెక్టర్ మేజర్-జనరల్ సైఫ్ ముహైర్ అల్ మజ్రౌయి.. "ఇంజిన్ వేగాన్ని పెంచే సాంకేతికతలను ఉపయోగించవద్దని, ఇవి నివాస ప్రాంతాల నివాసితులకు ప్రమాదాన్ని కలిగిస్తాయి." అని హెచ్చరించారు. దుబాయ్ పోలీస్ స్మార్ట్ యాప్లో అందుబాటులో ఉన్న "పోలీస్ ఐ" లేదా "వి ఆర్ ఆల్ పోలీస్" , 901కి కాల్ చేయడం ద్వారా నివేదించాలని ఆయన ప్రజలను కోరారు.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







