యూఏఈలో నవంబర్ 25 నుండి డ్రోన్ల పై నిషేధం ఎత్తివేత..!!
- November 24, 2024
యూఏఈ: డ్రోన్ కార్యకలాపాలపై యూఏఈ నిషేధం ఎత్తివేయనుంది.నవంబర్ 25 నుండి దశలవారీగా డ్రోన్ కార్యకలాపాలపై నిషేధం ఎత్తివేయనున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నేషనల్ ఎమర్జెన్సీ, క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ సహకారంతో అబుదాబి పోలీస్ కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ మేరకు ప్రకటించారు.అయితే, డ్రోన్ కార్యకలాపాల కోసం ఒక వేదికను ప్రారంభించనున్నట్లు తెలిపింది.ప్లాట్ఫారమ్ మొదటి దశలో కేవలం సేవలు అందించే కంపెనీలు, ప్రభుత్వ ఏజెన్సీలకు మాత్రమే పరిమితం చేయబడుతుందని జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ సపోర్ట్లోని ఎయిర్ సపోర్ట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ జమాల్ అల్ హోసానీ చెప్పారు. రెండో దశలో వ్యక్తిగత వినియోగానికి అనుమతి ఇస్తామని తెలిపారు. 2022లో యూఏఈ డ్రోన్ల వినియోగాన్ని నిషేధించింది.
తాజా వార్తలు
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









