యూఏఈలో నవంబర్ 25 నుండి డ్రోన్ల పై నిషేధం ఎత్తివేత..!!
- November 24, 2024
యూఏఈ: డ్రోన్ కార్యకలాపాలపై యూఏఈ నిషేధం ఎత్తివేయనుంది.నవంబర్ 25 నుండి దశలవారీగా డ్రోన్ కార్యకలాపాలపై నిషేధం ఎత్తివేయనున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నేషనల్ ఎమర్జెన్సీ, క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ సహకారంతో అబుదాబి పోలీస్ కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ మేరకు ప్రకటించారు.అయితే, డ్రోన్ కార్యకలాపాల కోసం ఒక వేదికను ప్రారంభించనున్నట్లు తెలిపింది.ప్లాట్ఫారమ్ మొదటి దశలో కేవలం సేవలు అందించే కంపెనీలు, ప్రభుత్వ ఏజెన్సీలకు మాత్రమే పరిమితం చేయబడుతుందని జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ సపోర్ట్లోని ఎయిర్ సపోర్ట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ జమాల్ అల్ హోసానీ చెప్పారు. రెండో దశలో వ్యక్తిగత వినియోగానికి అనుమతి ఇస్తామని తెలిపారు. 2022లో యూఏఈ డ్రోన్ల వినియోగాన్ని నిషేధించింది.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







