డిసెంబర్ 1 నుండి ఓటీపీలు రావా? టెలికం సంస్థలకు TRAI కొత్త రూల్స్
- November 25, 2024
న్యూ ఢిల్లీ: డిసెంబర్ 1 నుండి బ్యాంకింగ్ మరియు ఇతర ఆన్లైన్ లావాదేవీలలో కీలకపాత్ర పోషించే ఓటీపీలు ఇకనుండి మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.ఈ సందర్భంగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) టెలికాం కంపెనీలకు అంటే Jio, Airtel, Vi మరియు BSNLలకు, ఓటీపీ ఆధారిత సందేశాలను ట్రాక్ చేయడానికి ట్రేస్బిలిటీని అమలు చేయాలని ఆదేశించింది. డిసెంబర్ 1 నుండి ఓటీపీలకు సంబంధించి టెలికం కంపెనీలు కొత్త మార్గదర్శకాలకు లోబడి ఉంటాయి. ఈ మార్గదర్శకాలు డిసెంబర్ 1 నుండి అమల్లోకి వస్తాయి. TRAI తీసుకున్న ఈ ముఖ్యమైన నిర్ణయం వలన స్కామర్లు మరియు సైబర్ నేరగాళ్ల బారి నుండి ప్రజలను సమర్థవంతంగా రక్షించవచ్చు అని ట్రాయ్ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో మెసేజ్ ట్రేస్బిలిటీని అమలు చేయమని టెలికాం కంపెనీలకు ట్రాయ్ సూచించింది.
ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ మరియు స్మార్ట్ఫోన్ల విస్తృత వినియోగం వల్ల సాంకేతికతలు పెరిగాయి. పెరిగిన టెక్నాలజీతో పాటు అనేక సైబర్ ప్రమాదాలు కూడా పెరిగాయి. స్మార్ట్ఫోన్లు అనేక పనులను సులభతరం చేసినప్పటికీ అవి స్కామర్లు మరియు సైబర్ నేరగాళ్లకు ప్రజలను మోసం చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆన్లైన్ మోసాల నుండి వ్యక్తులను రక్షించడానికి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) అనేక చర్యలను అమలు చేసింది.
ఇక వాణిజ్య సందేశాలు మరియు వన్-టైమ్ పాస్వర్డ్లు (OTPలు)పై దృష్టి సారిస్తూ ఈ నిర్ణయం ఆగస్టులో ప్రకటించబడింది. ప్రారంభంలో టెలికాం కంపెనీలకు ఈ ట్రేస్బిలిటీ చర్యలను అమలు చేయడానికి అక్టోబర్ 31 వరకు గడువు ఇవ్వబడింది. అయితే, Jio, Airtel, VI మరియు BSNL వంటి ప్రధాన టెలికం సంస్థల అభ్యర్థనల మేరకు ఈ గడువును నవంబర్ 31 వరకు పొడిగించారు. కొత్త గడువు సమీపిస్తున్నందున ఈ కంపెనీలు వాణిజ్య మరియు OTP సందేశాలను ట్రాక్ చేయడంలో TRAI యొక్క నిబంధనలను తప్పనిసరిగా పాటించాలనీ సూచించింది.
అయితే డిసెంబర్ 1 నుండి Jio, Airtel, VI మరియు BSNL ఈ ట్రేసిబిలిటీ చర్యలను అమలు చేయడం ప్రారంభిస్తే,l OTP సందేశాలు ఆలస్యం కావచ్చు. ఫలితంగా మీరు బ్యాంకింగ్ లేదా బుకింగ్ రిజర్వేషన్ల వంటి కార్యకలాపాలలో నిమగ్నమై ఉంటే మీ OTP కోసం ఎక్కువసేపు వేచి ఉండవలసి రావచ్చు. స్కామర్లు తరచుగా వ్యక్తుల పరికరాలకు నకిలీ OTP సందేశాలను పంపించి వినియోగదారులను మోసం చేస్తున్న నేపథ్యంలో TRAI అన్ని టెలికాం కంపెనీలు ఈ నియమాన్ని అమలు చేయడం ద్వారా వినియోగదారులను మరింత సమర్థవంతంగా రక్షించ వచ్చని TRAI అభిప్రాయపడింది.
ఈ మార్పులు వినియోగదారుల భద్రతను పెంచడానికి మరియు మోసపూరిత కార్యకలాపాలను నిరోధించడానికి ఉద్దేశించబడ్డాయి. టెలికాం కంపెనీలు ఈ మార్గదర్శకాలను పాటించడం ద్వారా, వినియోగదారులు మరింత భద్రతతో తమ లావాదేవీలను నిర్వహించగలరు.
ఈ మార్గదర్శకాలు ఎలా పనిచేస్తాయో మరియు వినియోగదారులపై వాటి ప్రభావం ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం.మీరు మరింత సమాచారం కోసం మీ టెలికాం ప్రొవైడర్ను సంప్రదించవచ్చు.
--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!









