డిసెంబర్ 1 నుండి ఓటీపీలు రావా? టెలికం సంస్థలకు TRAI కొత్త రూల్స్
- November 25, 2024
న్యూ ఢిల్లీ: డిసెంబర్ 1 నుండి బ్యాంకింగ్ మరియు ఇతర ఆన్లైన్ లావాదేవీలలో కీలకపాత్ర పోషించే ఓటీపీలు ఇకనుండి మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.ఈ సందర్భంగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) టెలికాం కంపెనీలకు అంటే Jio, Airtel, Vi మరియు BSNLలకు, ఓటీపీ ఆధారిత సందేశాలను ట్రాక్ చేయడానికి ట్రేస్బిలిటీని అమలు చేయాలని ఆదేశించింది. డిసెంబర్ 1 నుండి ఓటీపీలకు సంబంధించి టెలికం కంపెనీలు కొత్త మార్గదర్శకాలకు లోబడి ఉంటాయి. ఈ మార్గదర్శకాలు డిసెంబర్ 1 నుండి అమల్లోకి వస్తాయి. TRAI తీసుకున్న ఈ ముఖ్యమైన నిర్ణయం వలన స్కామర్లు మరియు సైబర్ నేరగాళ్ల బారి నుండి ప్రజలను సమర్థవంతంగా రక్షించవచ్చు అని ట్రాయ్ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో మెసేజ్ ట్రేస్బిలిటీని అమలు చేయమని టెలికాం కంపెనీలకు ట్రాయ్ సూచించింది.
ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ మరియు స్మార్ట్ఫోన్ల విస్తృత వినియోగం వల్ల సాంకేతికతలు పెరిగాయి. పెరిగిన టెక్నాలజీతో పాటు అనేక సైబర్ ప్రమాదాలు కూడా పెరిగాయి. స్మార్ట్ఫోన్లు అనేక పనులను సులభతరం చేసినప్పటికీ అవి స్కామర్లు మరియు సైబర్ నేరగాళ్లకు ప్రజలను మోసం చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆన్లైన్ మోసాల నుండి వ్యక్తులను రక్షించడానికి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) అనేక చర్యలను అమలు చేసింది.
ఇక వాణిజ్య సందేశాలు మరియు వన్-టైమ్ పాస్వర్డ్లు (OTPలు)పై దృష్టి సారిస్తూ ఈ నిర్ణయం ఆగస్టులో ప్రకటించబడింది. ప్రారంభంలో టెలికాం కంపెనీలకు ఈ ట్రేస్బిలిటీ చర్యలను అమలు చేయడానికి అక్టోబర్ 31 వరకు గడువు ఇవ్వబడింది. అయితే, Jio, Airtel, VI మరియు BSNL వంటి ప్రధాన టెలికం సంస్థల అభ్యర్థనల మేరకు ఈ గడువును నవంబర్ 31 వరకు పొడిగించారు. కొత్త గడువు సమీపిస్తున్నందున ఈ కంపెనీలు వాణిజ్య మరియు OTP సందేశాలను ట్రాక్ చేయడంలో TRAI యొక్క నిబంధనలను తప్పనిసరిగా పాటించాలనీ సూచించింది.
అయితే డిసెంబర్ 1 నుండి Jio, Airtel, VI మరియు BSNL ఈ ట్రేసిబిలిటీ చర్యలను అమలు చేయడం ప్రారంభిస్తే,l OTP సందేశాలు ఆలస్యం కావచ్చు. ఫలితంగా మీరు బ్యాంకింగ్ లేదా బుకింగ్ రిజర్వేషన్ల వంటి కార్యకలాపాలలో నిమగ్నమై ఉంటే మీ OTP కోసం ఎక్కువసేపు వేచి ఉండవలసి రావచ్చు. స్కామర్లు తరచుగా వ్యక్తుల పరికరాలకు నకిలీ OTP సందేశాలను పంపించి వినియోగదారులను మోసం చేస్తున్న నేపథ్యంలో TRAI అన్ని టెలికాం కంపెనీలు ఈ నియమాన్ని అమలు చేయడం ద్వారా వినియోగదారులను మరింత సమర్థవంతంగా రక్షించ వచ్చని TRAI అభిప్రాయపడింది.
ఈ మార్పులు వినియోగదారుల భద్రతను పెంచడానికి మరియు మోసపూరిత కార్యకలాపాలను నిరోధించడానికి ఉద్దేశించబడ్డాయి. టెలికాం కంపెనీలు ఈ మార్గదర్శకాలను పాటించడం ద్వారా, వినియోగదారులు మరింత భద్రతతో తమ లావాదేవీలను నిర్వహించగలరు.
ఈ మార్గదర్శకాలు ఎలా పనిచేస్తాయో మరియు వినియోగదారులపై వాటి ప్రభావం ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం.మీరు మరింత సమాచారం కోసం మీ టెలికాం ప్రొవైడర్ను సంప్రదించవచ్చు.
--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







