ఓ పంది పిల్ల ప్రధాన పాత్రగా సినిమా తీయనున్న డైరెక్టర్ రవిబాబు
- June 25, 2016
అల్లరి, అవును, అనసూయ, లడ్డూ బాబు లాంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవిబాబు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ కు భిన్నంగా సినిమాలు చేసే రవిబాబు. ఇప్పుడు మరో ప్రయోగం చేస్తున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి ఈగ ప్రధాన పాత్రలో సినిమాను తెరకెక్కిస్తే క్రియేటివ్ డైరెక్టర్ రవిబాబు ఓ పంది పిల్ల ప్రధాన పాత్రగా సినిమాను తెరకెక్కిస్తున్నాడు.పూర్తిగా పంది పిల్ల చుట్టూ తిరిగే కథతో రూపొందుతున్న ఈ సినిమాతో అభిషేక్, నబా హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. ఎక్కువగా యానిమేషన్ గ్రాఫిక్స్ తో రూపొందిస్తున్న ఈ సినిమాకు సురేష్ బాబు నిర్మాత. ఈ సినిమాలో పంది పిల్లను గ్రాఫిక్స్ లో క్రియేట్ చేయటం కోసం దాదాపుగా 2 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









