ఓ పంది పిల్ల ప్రధాన పాత్రగా సినిమా తీయనున్న డైరెక్టర్ రవిబాబు
- June 25, 2016
అల్లరి, అవును, అనసూయ, లడ్డూ బాబు లాంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవిబాబు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ కు భిన్నంగా సినిమాలు చేసే రవిబాబు. ఇప్పుడు మరో ప్రయోగం చేస్తున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి ఈగ ప్రధాన పాత్రలో సినిమాను తెరకెక్కిస్తే క్రియేటివ్ డైరెక్టర్ రవిబాబు ఓ పంది పిల్ల ప్రధాన పాత్రగా సినిమాను తెరకెక్కిస్తున్నాడు.పూర్తిగా పంది పిల్ల చుట్టూ తిరిగే కథతో రూపొందుతున్న ఈ సినిమాతో అభిషేక్, నబా హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. ఎక్కువగా యానిమేషన్ గ్రాఫిక్స్ తో రూపొందిస్తున్న ఈ సినిమాకు సురేష్ బాబు నిర్మాత. ఈ సినిమాలో పంది పిల్లను గ్రాఫిక్స్ లో క్రియేట్ చేయటం కోసం దాదాపుగా 2 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







