చంద్రబాబునాయుడు హాంకాంగ్‌కు చేరుకున్నారు..

- June 25, 2016 , by Maagulf
చంద్రబాబునాయుడు హాంకాంగ్‌కు చేరుకున్నారు..

ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు హాంకాంగ్‌కు చేరుకున్నారు. సాయంత్రం 4:35కి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో పాల్గొనేందుకు ఆయన హాంకాంగ్ వెళ్లారు. అలాగే రాత్రి రాత్రి 7:30 నుంచి 10గంటల వరకు వివిధ రంగాల వ్యాపార ప్రముఖులతో ద్వైపాక్షిక సమావేశాల్లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. అలాగే శ్రీలంక వాణిజ్య మంత్రి సమర విక్రమతో కూడా బాబు భేటీ కానున్నారు. అలాగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం యుఎస్ఏ ఎండీ సనిటా నాయర్‌తో కూడా ముఖ్యమంత్రి భేటీ కానున్నారు.
ఇక రేపు మధ్యాహ్నం వరల్డ్ ఎకనామిక్ ఫోరం చైర్మన్ ప్రొఫెసర్ ష్క్వాబ్‌తో భేటీ కానున్నారు. రేపు సాయంత్రం డబ్ల్యూఈఎఫ్ వేదికగా జరిగే సిటీస్ బై డిజైన్, నాట్ డిమాండ్ అంశంపై చంద్రబాబు ప్రసంగించనున్నారు. అంతేగాక షేపింగ్ ఏ ఫుడ్ సిస్టమ్ ఎజెండా అంశంపై కూడా ఆయన ప్రసంగించనున్నారు. రేపు రాత్రి ప్రపంచ ఆర్థిక వేదిక నిర్వహించే 'షేపింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ప్రొడక్షన్' చర్చాగోష్ఠిలో చంద్రబాబు పాల్గొననున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com