జువెలరీ అరేబియా 2024ను ప్రారంభించిన క్రౌన్ ప్రిన్స్..!!
- November 27, 2024
మనామా: బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా సఖిర్లోని ఎగ్జిబిషన్ వరల్డ్ బహ్రెయిన్లో జ్యువెలరీ అరేబియా, సెంట్ అరేబియా 2024 ఎగ్జిబిషన్లను ప్రారంభించారు. బహ్రెయిన్ ఎకనామిక్ విజన్ 2030కి అనుగుణంగా ఆర్థిక వైవిధ్యీకరణ కార్యక్రమాలకు మద్దతునిస్తూనే ప్రాంతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలకు బహ్రెయిన్ను ప్రపంచ కేంద్రంగా నిలిపాయని రాయల్ హైనెస్ పేర్కొన్నారు. కింగ్డమ్ పెట్టుబడి వాతావరణాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. అనంతరం హెచ్ఆర్హెచ్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ ఎగ్జిబిషన్ను సందర్శించారు. జువెలరీ అరేబియా, సెంట్ అరేబియా 2024 ఎగ్జిబిషన్లలో 27 దేశాల నుండి 700 మంది జ్యూయలరీ ఎగ్జిబిటర్లు ఈ ఈవెంట్ లో పాల్గొంటున్నారు. ఈ ప్రదర్శనలో విలువైన బంగారు ఆభరణాలు, రత్నాలు, ప్రముఖ బ్రాండ్ల పెర్ఫ్యూమ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









