భార్యకు బంగారు గొలుసు కొంటే లక్కీగా 8 కోట్లు వరించిన అదృష్టం
- November 30, 2024
అదృష్టం అంటే ఇతడిదే.. ఎందుకంటే సింగపూర్లో ఒక ప్రవాస భారతీయుడు భార్య కోసం బంగారు గొలుసు కొంటే ఏకంగా లక్కీ డ్రాలో రూ.8 కోట్లు గెలుచుకున్నాడు.ఇది కదా అదృష్టం అంటే.ఇంతకీ ఈ అదృష్టవంతుడు ఎవరో డీటెయిల్ గా తెలుసుకుందాం.
సింగపూర్లో భారతీయ సంతతికి చెందిన బాలసుబ్రమణ్యం చిదంబరం అనే వ్యక్తి తన భార్య కోసం స్థానికంగా ఉన్న ముస్తఫా జ్యువెలరీ షాపులో మూడు నెలల క్రితం 6000 డాలర్ల విలువైన బంగారు గొలుసు కొనుగోలు చేశాడు. కొనుగోలు చేసే సమయంలో 250 డాలర్ల కన్నా ఎక్కువ విలువైన ఆభరణాలు కొనుగోలు చేసిన వారికి ఆ జ్యూవెలరీ షాపు లక్కీ డ్రా కు అర్హత ఉంది.
మొదట లక్కీ డ్రా గురించి అంతగా ఆసక్తి చూపని చిదంబరం తరువాత 'ఏమో గుర్రం ఎగరావచ్చు' అని అనుకుని డ్రా కుపన్ నింపి తను కొనుగోలు చేసిన బంగారముతో ఇంటికి వెళ్ళాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు జరిగిన జ్యువెలరీ వార్షిక కార్యక్రమంలో లక్కీ డ్రా నిర్వహించారు.ఈ లక్కీ డ్రాలో చిదంబరం ఏకంగా 1 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ (రూ. 8 కోట్లు) గెలుచుకున్నాడు.
అది కూడా తన నాన్న వర్ధంతి రోజున ఈ లక్కీ డ్రా తనను వరించడంతో చిదంబరం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఈ శుభవార్త తన తల్లితో పంచుకోనీ ఆనంద పారవశ్యం చెందిన చిదంబరం గెలిచిన దాంట్లో కొంత భాగాన్ని సమాజానికి విరాళంగా ఇస్తున్నానని తన తల్లితో చెప్పి ఈ విధంగా నాన్న ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.
--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్
- ఖతార్ లో ‘రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్లీ’తో రియల్ మోసాలకు చెక్..!!
- సోహార్లో బస్సు బోల్తా..18 మందికి గాయాలు..!!
- సౌదీ అరేబియాలో హాటెస్ట్ మంత్ గా జూలై ఉండబోతుందా?







