భార్యకు బంగారు గొలుసు కొంటే లక్కీగా 8 కోట్లు వరించిన అదృష్టం
- November 30, 2024
అదృష్టం అంటే ఇతడిదే.. ఎందుకంటే సింగపూర్లో ఒక ప్రవాస భారతీయుడు భార్య కోసం బంగారు గొలుసు కొంటే ఏకంగా లక్కీ డ్రాలో రూ.8 కోట్లు గెలుచుకున్నాడు.ఇది కదా అదృష్టం అంటే.ఇంతకీ ఈ అదృష్టవంతుడు ఎవరో డీటెయిల్ గా తెలుసుకుందాం.
సింగపూర్లో భారతీయ సంతతికి చెందిన బాలసుబ్రమణ్యం చిదంబరం అనే వ్యక్తి తన భార్య కోసం స్థానికంగా ఉన్న ముస్తఫా జ్యువెలరీ షాపులో మూడు నెలల క్రితం 6000 డాలర్ల విలువైన బంగారు గొలుసు కొనుగోలు చేశాడు. కొనుగోలు చేసే సమయంలో 250 డాలర్ల కన్నా ఎక్కువ విలువైన ఆభరణాలు కొనుగోలు చేసిన వారికి ఆ జ్యూవెలరీ షాపు లక్కీ డ్రా కు అర్హత ఉంది.
మొదట లక్కీ డ్రా గురించి అంతగా ఆసక్తి చూపని చిదంబరం తరువాత 'ఏమో గుర్రం ఎగరావచ్చు' అని అనుకుని డ్రా కుపన్ నింపి తను కొనుగోలు చేసిన బంగారముతో ఇంటికి వెళ్ళాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు జరిగిన జ్యువెలరీ వార్షిక కార్యక్రమంలో లక్కీ డ్రా నిర్వహించారు.ఈ లక్కీ డ్రాలో చిదంబరం ఏకంగా 1 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ (రూ. 8 కోట్లు) గెలుచుకున్నాడు.
అది కూడా తన నాన్న వర్ధంతి రోజున ఈ లక్కీ డ్రా తనను వరించడంతో చిదంబరం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఈ శుభవార్త తన తల్లితో పంచుకోనీ ఆనంద పారవశ్యం చెందిన చిదంబరం గెలిచిన దాంట్లో కొంత భాగాన్ని సమాజానికి విరాళంగా ఇస్తున్నానని తన తల్లితో చెప్పి ఈ విధంగా నాన్న ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.
--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజలు తరలింపు
- లోక్సభ స్పీకర్ పై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం..
- టీమ్ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా..
- సౌదీ రక్షణ దళాల చర్య: బాలిస్టిక్ క్షిపణి, రెండు డ్రోన్లు నిర్వీర్యం
- గ్యాస్ వినియోగదారులకు షాక్
- విదేశాల్లో ఇరానీయులకు హెచ్చరిక, దేశద్రోహం చేస్తే మరణశిక్ష
- రాత్రి సమయంలో ఎమర్జెన్సీ అలర్ట్ సౌండ్ లో మార్పు
- అబుదాబి నుండి భారత్కు ఎతిహాద్ విమానాలు–నేటి షెడ్యూల్
- మనామాలో నివాస భవనం పై ఇరాన్ దాడి: ఒకరు మృతి, పలువురికి గాయాలు
- కమ్యూనిటీ వర్చువల్ సమావేశం నిర్వహించిన భారత రాయబారి..!!









