అమెరికాలో కాల్పులు..తెలంగాణ విద్యార్థి మృతి
- November 30, 2024
అమెరికా: అమెరికాలో తుపాకీ తూటాలకు మరో తెలుగు విద్యార్థి బలయ్యాడు.చికాగో వద్ద దుండగులు జరిపిన కాల్పుల్లో ఖమ్మం జిల్లా రామన్నపేటకు చెందిన నూకారపు సాయితేజ (26)చనిపోయాడు.సాయితేజ ఎంఎస్ చదవడానికి 4నెలల క్రితమే యూఎస్ వెళ్లాడు.అతడు షాపింగ్ మాల్లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తుండగా దొంగతనానికి వచ్చిన దుండగులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.
ఖమ్మం నగరంలో రమణగుట్ట ప్రాంతానికి చెందిన నూకారపు కోటేశ్వరరావు కుమారుడు సాయితేజ 4 నెలల క్రితం ఎంఎస్ చదవడానికి అమెరికా వెళ్లారు.భారత కాలమాన ప్రకారం శుక్రవారం రాత్రి ఒంటిగంటకు షాపింగ్ మాల్స్ లో స్టోర్ మేనేజర్ గా పనిచేస్తున్న సాయితేజపై ఇద్దరూ గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కాల్పులు జరిపి క్యాష్ కౌంటర్ లోని నగదుతో పారిపోయారు. అతని భౌతికకాయం ఖమ్మం నగరానికి తీసుకురావడానికి తానా ప్రతినిధులు కృషి చేస్తున్నారు.
తాజా వార్తలు
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్..!!
- కువైట్లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!
- యూఏఈలో మెడిసిన్ స్టాక్ పై ఆందోళన వద్దు..!!









