TGPSC ఛైర్మన్ గా బుర్రా వెంకటేశం నియామకం
- November 30, 2024
హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ కమిషన్ ఛైర్మన్ గా బుర్రా వెంకటేశం నియమితులయ్యారు.ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కమిషన్ లో కొత్త సభ్యులను నియమించగా, తాజాగా ఛైర్మన్ కూడా నియమించింది.
కాగా, ప్రస్తుతం టీజీపీఎస్సీ చైర్మన్గా ఎం.మహేందర్ రెడ్డి కొనసాగుతున్నారు.ఆయన పదవీకాలం డిసెంబర్ 3న ముగియనుంది. దీంతో కొత్త చైర్మన్ నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 20 వరకు దరఖాస్తులు స్వీకరించింది. మొత్తం 45 అప్లికేషన్లు రాగా అందులో రిటైర్డ్ ఐఏఎస్లు, వివిధ వర్సిటీలకు చెందిన ప్రొఫసర్లు కూడా ఉన్నారు.వారిలో బుర్రా వెంకటేశంను ఎంపిక చేసిన ప్రభుత్వం.. నియామక ఆమోదం కోసం ఫైలును రాజ్భవన్కు పంపించింది.దీంతో శనివారం ఉదయం ఆ ఫైలుపై గవర్నర్ సంతకం చేశారు.దీంతో మరో నాలుగేండ్ల సర్వీస్ ఉన్నప్పటికీ.. ముందుగానే స్వచ్ఛంద పదవీ విరమణ చేయనున్నారు. డిసెంబర్ 2న టీజీపీఎస్సీ చైర్మన్గా బాధ్యతలు తీసుకోనున్నారు. 2030 వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









