TGPSC ఛైర్మన్ గా బుర్రా వెంకటేశం నియామకం
- November 30, 2024
హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ కమిషన్ ఛైర్మన్ గా బుర్రా వెంకటేశం నియమితులయ్యారు.ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కమిషన్ లో కొత్త సభ్యులను నియమించగా, తాజాగా ఛైర్మన్ కూడా నియమించింది.
కాగా, ప్రస్తుతం టీజీపీఎస్సీ చైర్మన్గా ఎం.మహేందర్ రెడ్డి కొనసాగుతున్నారు.ఆయన పదవీకాలం డిసెంబర్ 3న ముగియనుంది. దీంతో కొత్త చైర్మన్ నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 20 వరకు దరఖాస్తులు స్వీకరించింది. మొత్తం 45 అప్లికేషన్లు రాగా అందులో రిటైర్డ్ ఐఏఎస్లు, వివిధ వర్సిటీలకు చెందిన ప్రొఫసర్లు కూడా ఉన్నారు.వారిలో బుర్రా వెంకటేశంను ఎంపిక చేసిన ప్రభుత్వం.. నియామక ఆమోదం కోసం ఫైలును రాజ్భవన్కు పంపించింది.దీంతో శనివారం ఉదయం ఆ ఫైలుపై గవర్నర్ సంతకం చేశారు.దీంతో మరో నాలుగేండ్ల సర్వీస్ ఉన్నప్పటికీ.. ముందుగానే స్వచ్ఛంద పదవీ విరమణ చేయనున్నారు. డిసెంబర్ 2న టీజీపీఎస్సీ చైర్మన్గా బాధ్యతలు తీసుకోనున్నారు. 2030 వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







