చెన్నై విమానాశ్రయంలో ఇండిగో విమానంకు తృటిలో తప్పిన ప్రమాదం..
- December 01, 2024
చెన్నై: చెన్నై విమానాశ్రయంలో ఇండిగో ఎయిర్ లైన్స్ కు చెందిన విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగాల్ తుఫాన్ కారణంగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.చెన్నైలోనూ ఎడతెరిపిలేని వర్షం కురవడంతో విమానాశ్రయంలోసైతం నీరు చేరింది. రన్వే పైకి వర్షపు నీరు రావడంతో విమానాలు దిగేందుకు, ఎగిరేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.
విమానాశ్రయం రన్వేపై వర్షపు నీరు ఉన్న సమయంలో ఇండిగో ఎయిర్లైన్స్ ఎయిర్బస్ విమానం ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నించింది. ల్యాండింగ్ అయ్యే క్రమంలో నియంత్రణ కోల్పోవడంతో అప్రమత్తమైన పైలెట్ తిరిగి విమానాన్ని గాల్లోకి తీసుకెళ్లాడు. దీంతో ప్రమాదం తప్పినట్లయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలాఉంటే.. భారీ వర్షాల కారణంగా చెన్నై విమానాశ్రయంలో నీరు చేరడంతో శనివారం తాత్కాలికంగా విమానాల రాకపోకలను నిలిపివేశారు. ఆదివారం తెల్లవారు జామునుంచి విమానాల రాకపోకలకు అనుమతి ఇవ్వడంతో ఇండిగో ఎయిర్ లైన్స్ ఆదివారం ఉదయం విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది.
తాజా వార్తలు
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!
- బహ్రెయిన్ లో ప్రవాస ఇంజనీర్ల అర్హతల పై సమీక్ష..!!
- సాయుధ దళాల ధైర్య సాహసాలను ప్రశంసించిన కౌన్సిల్..!!
- డ్రోన్ ఆపరేట్..పోలీసుల అదుపులో ఐదుగురు..!!
- కువైట్ పై ఆరు డ్రోన్లతో దాడి..కూల్చేసిన సైన్యం..!!









