చెన్నై విమానాశ్రయంలో ఇండిగో విమానంకు తృటిలో తప్పిన ప్రమాదం..
- December 01, 2024
చెన్నై: చెన్నై విమానాశ్రయంలో ఇండిగో ఎయిర్ లైన్స్ కు చెందిన విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగాల్ తుఫాన్ కారణంగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.చెన్నైలోనూ ఎడతెరిపిలేని వర్షం కురవడంతో విమానాశ్రయంలోసైతం నీరు చేరింది. రన్వే పైకి వర్షపు నీరు రావడంతో విమానాలు దిగేందుకు, ఎగిరేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.
విమానాశ్రయం రన్వేపై వర్షపు నీరు ఉన్న సమయంలో ఇండిగో ఎయిర్లైన్స్ ఎయిర్బస్ విమానం ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నించింది. ల్యాండింగ్ అయ్యే క్రమంలో నియంత్రణ కోల్పోవడంతో అప్రమత్తమైన పైలెట్ తిరిగి విమానాన్ని గాల్లోకి తీసుకెళ్లాడు. దీంతో ప్రమాదం తప్పినట్లయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలాఉంటే.. భారీ వర్షాల కారణంగా చెన్నై విమానాశ్రయంలో నీరు చేరడంతో శనివారం తాత్కాలికంగా విమానాల రాకపోకలను నిలిపివేశారు. ఆదివారం తెల్లవారు జామునుంచి విమానాల రాకపోకలకు అనుమతి ఇవ్వడంతో ఇండిగో ఎయిర్ లైన్స్ ఆదివారం ఉదయం విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









