రియాద్ ప్రజలకు అందుబాటులోకి వచ్చిన మెట్రో సేవలు..!!
- December 02, 2024
రియాద్: సౌదీ రాజధాని రియాద్ ప్రజా రవాణాలో కొత్త శకానికి నాంది పలికింది. రియాద్ మెట్రో మూడు లైన్లలో అధికారికంగా కార్యకలాపాలను ప్రారంభించింది. రియాద్ మెట్రో అనేది మధ్యప్రాచ్యంలో అతిపెద్దది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన డ్రైవర్ లేని రైలు, ఆదివారం ఉదయం ప్రయాణికులకు ఉత్కంఠబరితమైన ప్రయాణ అనుభవాన్ని అందించింది. ప్రారంభ దశలో కార్యకలాపాలు మూడు లైన్లు 1వ లైన్ (బ్లూ లైన్); 4వ లైన్ (ఎల్లో లైన్); మరియు 6వ లైన్ (పర్పుల్ లైన్) రూట్లలో ప్రారంభమయ్యాయి.
బ్లూ లైన్ ఒలాయా స్ట్రీట్ను బాతాకు కలుపుతుంది.; ఎల్లో లైన్ కింగ్ ఖలీద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రోడ్ వెంట వెళుతుంది. అయితే పర్పుల్ లైన్ అబ్దుల్ రెహ్మాన్ బిన్ అవ్ఫ్ రోడ్ను అల్-షేక్ హసన్ బిన్ హుస్సేన్ రోడ్తో కలుపుతుంది.రెండు వారాల తర్వాత డిసెంబర్ 15న, కింగ్ అబ్దుల్లా రోడ్ను కవర్ చేసే లైన్ 2, (రెడ్ లైన్) కింగ్ అబ్దుల్లాజీజ్ రోడ్ను కవర్ చేసే లైన్ 5 (గ్రీన్ లైన్) సేవలు ప్రారంభం కానున్నాయి. జనవరి 5న లైన్ 3 (ఆరెంజ్ లైన్) మదీనా రోడ్ను కవర్ చేస్తూ మొత్తం ఆరు లైన్లు అందుబాటులోకి రానుంది.
రియాద్ మెట్రో ప్రాజెక్ట్ ఆరు ప్రధాన లైన్ల విస్తృత నెట్వర్క్ను కలిగి ఉంది. 176 కిలోమీటర్ల మేర విస్తరించి 4 ప్రధాన స్టేషన్లతో సహా 85 స్టేషన్లను కలుపుతుంది. ప్రయాణీకులు రాయల్ కమీషన్ ఫర్ రియాద్ సిటీ (RCRC) అందించిన డర్బ్(Darb) అప్లికేషన్ ద్వారా లేదా నేరుగా మెట్రో స్టేషన్లలో టిక్కెట్, లేదా వెండింగ్ మెషీన్ల ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. 19933 నంబర్లో ఫోన్ చేయడం ద్వారా మెట్రో సేవలకు సంబంధించిన వివరాలను పొందవచ్చు. రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ నవంబర్ 21న మెట్రో ప్రాజెక్టును ప్రారంభించారు. అధికారిక నివేదిక ప్రకారం.. రియాద్లో మెట్రో సేవలు ట్రాఫిక్ రద్దీని 30 శాతం తగ్గించవచ్చని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!
- కువైట్ చమురు క్షేత్రంపై డ్రోన్ దాడి..సరిహద్దుల్లో ఉద్రిక్తత..!!
- ఖతార్ మాజీ అమీర్ మృతికి సౌదీ కింగ్, క్రౌన్ ప్రిన్స్ సంతాపం..!!
- 12 రిక్రూట్మెంట్ సంస్థలపై సౌదీ ప్రభుత్వం కఠిన చర్యలు..!!
- ఏఐ, స్టార్టప్స్ రంగాల్లో బహ్రెయిన్ యువతకు ప్రత్యేక శిక్షణ..!!
- ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో ‘వ్యానీతి యోగా’ విద్యార్థుల ప్రతిభ..!!
- యూఏఈలో నాలుగు రోజుల పాటు సంతాప దినాలు..!!







