చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఒమన్..!!
- December 02, 2024మస్కట్: ఒమన్ రవాణా, కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తన నేషనల్ స్పేస్ ప్రోగ్రామ్ కింద తన మొదటి ప్రయోగాత్మక సైంటిఫిక్ రాకెట్ దుక్మ్-1( Duqm-1)ను ప్రయోగించనుంది. నేషనల్ స్పేస్ సర్వీసెస్ కంపెనీలో భాగమైన ఎట్లాక్ కంపెనీ ద్వారా నిధులు సమకూర్చిన ఈ ప్రాజెక్ట్.. ఒమన్ అంతరిక్ష రంగంలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. ఎట్లాక్ కంపెనీ మంత్రిత్వ శాఖతో కుదిరిన ఒప్పందం ద్వారా ప్రాజెక్ట్ను అమలు చేస్తోంది. రాకెట్ ప్రయోగాల కోసం స్పేస్పోర్ట్ను ఏర్పాటు చేయడానికి అల్-కహ్ల్, విలాయత్ ఆఫ్ దుక్మ్, అల్-వుస్తా గవర్నరేట్లో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ఒమన్ ఎగ్జిక్యూటివ్ స్పేస్ సెక్టార్ ప్రోగ్రాం కింద ఈ చొరవను ఒక వ్యూహాత్మక చర్యగా రవాణా, కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి సెడ్ బిన్ హమూద్ అల్-మావాలి అభివర్ణించారు. ఒమన్ భౌగోళిక ప్రయోజనాలు, అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని స్థానికీకరించడం, పెట్టుబడులను ఆకర్షించడం, ప్రైవేట్ రంగ భాగస్వామ్యాలను ప్రోత్సహించడం వంటి లక్ష్యాలను ఏర్పరుచుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్ట్ అంతరిక్ష పరిశ్రమలో ఉపాధి అవకాశాలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.
ఇది అంతరిక్ష రంగంలో ప్రాంతీయ, అంతర్జాతీయ సహకారాన్ని కూడా మెరుగుపరుస్తుందన్నారు. ఒమన్ భౌగోళికంగా భూమధ్యరేఖ, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కు సమీపంలో ఉండటంతో పాటు, ఉపగ్రహ ప్రయోగాలకు ఖర్చులు, సమయాన్ని తగ్గిస్తుందన్నారు. దీంతోపాటు ఒమన్ విస్తారమైన తీరప్రాంతం రాకెట్ ప్రయోగ కార్యకలాపాలకు సురక్షితమైన వాతావరణాన్ని అందిస్తుందని, డుక్మ్లోని స్పేస్ సేజ్ ప్రపంచ పెట్టుబడులకు ఆకర్షణీయమైన ప్రదేశంగా మారుతుందని భావిస్తున్నారు.
దుక్మ్-1 మొదటి ప్రయోగం వచ్చే బుధవారం (18°N, 56°E కోఆర్డినేట్లు) షెడ్యూల్ చేశారు. 6.5 మీటర్ల రాకెట్, ఇంధనం నింపినప్పుడు 123 కిలోల బరువు, 1,530 మీ/సె వేగంతో దాదాపు 15 నిమిషాల అనంతరం సముద్ర మట్టానికి 140 కి.మీ ఎత్తుకు చేరుకుంటుంది. ఒమన్ 2025లో మూడు రాకెట్ ప్రయోగాలను ప్లాన్ చేస్తుంది. తేదీలు ఇంకా ఖరారు కాలేదు. నేషనల్ స్పేస్ సర్వీసెస్ కంపెనీ.. పూర్తిగా ఒమానీల యాజమాన్యంలో ఉంది. అంతరిక్ష రంగంలో ప్రాజెక్ట్లకు నాయకత్వం వహించడానికి 2021లో స్థాపించారు.
తాజా వార్తలు
- కాన్సస్లో దిగ్విజయంగా NATS బ్యాడ్మింటన్ టోర్నమెంట్
- తెలంగాణకు భారీ ఒప్పందం
- డిపోల ప్రైవేటీకరణ దుష్ప్రచారాన్ని ఖండించిన TGSRTC
- మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం...11 మంది మృతి
- తిరుపతి తొక్కిసలాట పై న్యాయ విచారణకు ఆదేశం
- ఘనంగా ముగిసిన రాచకొండ కమిషనరేట్ ఆరవ ఎడిషన్ వార్షిక స్పోర్ట్స్ మీట్-2025
- బిల్ గేట్స్తో సీఎం చంద్రబాబు భేటీ
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్స్ వైద్యులు
- శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రెడ్ అలర్ట్..
- కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టం.. అవగాహన ప్రచారాలను ముమ్మరం..!!