యూఏఈలో బోల్ట్ ఇ-హెయిలింగ్ యాప్ లాంచ్.. 7 రైడ్లపై 53% తగ్గింపు..!!
- December 02, 2024
దుబాయ్: యూఏఈలో ఇ-హెయిలింగ్ ప్లాట్ఫారమ్ బోల్ట్ ప్రారంభమైంది. దుబాయ్ నివాసితులు, పర్యాటకులు తొలి ఏడు రైడ్లపై 53 శాతం తగ్గింపును పొందవచ్చు. దేశం ఈద్ అల్ ఎతిహాద్ (యూఏఈ జాతీయ దినోత్సవం) సందర్భంగా ఈ ప్లాట్ఫారమ్ ప్రారంభించబడింది. దాని వ్యవస్థాపక 53వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ తగ్గింపు ప్రకటించారు. యాప్ను డౌన్లోడ్ చేసుకునే వారు డిసెంబర్ 15 వరకు తగ్గింపును పొందవచ్చు. ఒక్కో రైడ్కు గరిష్టంగా 35 దిర్హామ్ల తగ్గింపును బోల్ట్ తెలిపింది. అంతర్జాతీయ రైడ్-హెయిలింగ్ ప్లాట్ఫారమ్ బోల్ట్.. ఇది ఈజిప్ట్, సౌదీ అరేబియాతో సహా 50 దేశాలలో 600 నగరాల్లో సేవలను అందిస్తుంది. రాబోయే కొన్నేళ్లలో 80 శాతం టాక్సీ ట్రిప్పులను ఈ-హెయిలింగ్ యాప్ల ద్వారా బుక్ చేసుకోవాలని దుబాయ్ ప్రభుత్వం యోచిస్తోంది.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









