యూఏఈలో బోల్ట్ ఇ-హెయిలింగ్ యాప్ లాంచ్.. 7 రైడ్లపై 53% తగ్గింపు..!!
- December 02, 2024
దుబాయ్: యూఏఈలో ఇ-హెయిలింగ్ ప్లాట్ఫారమ్ బోల్ట్ ప్రారంభమైంది. దుబాయ్ నివాసితులు, పర్యాటకులు తొలి ఏడు రైడ్లపై 53 శాతం తగ్గింపును పొందవచ్చు. దేశం ఈద్ అల్ ఎతిహాద్ (యూఏఈ జాతీయ దినోత్సవం) సందర్భంగా ఈ ప్లాట్ఫారమ్ ప్రారంభించబడింది. దాని వ్యవస్థాపక 53వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ తగ్గింపు ప్రకటించారు. యాప్ను డౌన్లోడ్ చేసుకునే వారు డిసెంబర్ 15 వరకు తగ్గింపును పొందవచ్చు. ఒక్కో రైడ్కు గరిష్టంగా 35 దిర్హామ్ల తగ్గింపును బోల్ట్ తెలిపింది. అంతర్జాతీయ రైడ్-హెయిలింగ్ ప్లాట్ఫారమ్ బోల్ట్.. ఇది ఈజిప్ట్, సౌదీ అరేబియాతో సహా 50 దేశాలలో 600 నగరాల్లో సేవలను అందిస్తుంది. రాబోయే కొన్నేళ్లలో 80 శాతం టాక్సీ ట్రిప్పులను ఈ-హెయిలింగ్ యాప్ల ద్వారా బుక్ చేసుకోవాలని దుబాయ్ ప్రభుత్వం యోచిస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







