యూఏఈలో బోల్ట్ ఇ-హెయిలింగ్ యాప్ లాంచ్.. 7 రైడ్లపై 53% తగ్గింపు..!!
- December 02, 2024
దుబాయ్: యూఏఈలో ఇ-హెయిలింగ్ ప్లాట్ఫారమ్ బోల్ట్ ప్రారంభమైంది. దుబాయ్ నివాసితులు, పర్యాటకులు తొలి ఏడు రైడ్లపై 53 శాతం తగ్గింపును పొందవచ్చు. దేశం ఈద్ అల్ ఎతిహాద్ (యూఏఈ జాతీయ దినోత్సవం) సందర్భంగా ఈ ప్లాట్ఫారమ్ ప్రారంభించబడింది. దాని వ్యవస్థాపక 53వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ తగ్గింపు ప్రకటించారు. యాప్ను డౌన్లోడ్ చేసుకునే వారు డిసెంబర్ 15 వరకు తగ్గింపును పొందవచ్చు. ఒక్కో రైడ్కు గరిష్టంగా 35 దిర్హామ్ల తగ్గింపును బోల్ట్ తెలిపింది. అంతర్జాతీయ రైడ్-హెయిలింగ్ ప్లాట్ఫారమ్ బోల్ట్.. ఇది ఈజిప్ట్, సౌదీ అరేబియాతో సహా 50 దేశాలలో 600 నగరాల్లో సేవలను అందిస్తుంది. రాబోయే కొన్నేళ్లలో 80 శాతం టాక్సీ ట్రిప్పులను ఈ-హెయిలింగ్ యాప్ల ద్వారా బుక్ చేసుకోవాలని దుబాయ్ ప్రభుత్వం యోచిస్తోంది.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









