యూఏఈలో బోల్ట్ ఇ-హెయిలింగ్ యాప్ లాంచ్.. 7 రైడ్లపై 53% తగ్గింపు..!!
- December 02, 2024
దుబాయ్: యూఏఈలో ఇ-హెయిలింగ్ ప్లాట్ఫారమ్ బోల్ట్ ప్రారంభమైంది. దుబాయ్ నివాసితులు, పర్యాటకులు తొలి ఏడు రైడ్లపై 53 శాతం తగ్గింపును పొందవచ్చు. దేశం ఈద్ అల్ ఎతిహాద్ (యూఏఈ జాతీయ దినోత్సవం) సందర్భంగా ఈ ప్లాట్ఫారమ్ ప్రారంభించబడింది. దాని వ్యవస్థాపక 53వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ తగ్గింపు ప్రకటించారు. యాప్ను డౌన్లోడ్ చేసుకునే వారు డిసెంబర్ 15 వరకు తగ్గింపును పొందవచ్చు. ఒక్కో రైడ్కు గరిష్టంగా 35 దిర్హామ్ల తగ్గింపును బోల్ట్ తెలిపింది. అంతర్జాతీయ రైడ్-హెయిలింగ్ ప్లాట్ఫారమ్ బోల్ట్.. ఇది ఈజిప్ట్, సౌదీ అరేబియాతో సహా 50 దేశాలలో 600 నగరాల్లో సేవలను అందిస్తుంది. రాబోయే కొన్నేళ్లలో 80 శాతం టాక్సీ ట్రిప్పులను ఈ-హెయిలింగ్ యాప్ల ద్వారా బుక్ చేసుకోవాలని దుబాయ్ ప్రభుత్వం యోచిస్తోంది.
తాజా వార్తలు
- దోహా ఫోరం 2025: QR2.016 బిలియన్ల విలువైన ఒప్పందాలు..!!
- అల్-రాయ్లో ఇద్దరు కార్మికులు మృతి..!!
- యునెస్కో జాబితాలో ఒమన్ 'బిష్ట్' రిజిస్టర్..!!
- బహ్రెయిన్ లో నేషనల్ డే ,యాక్సెషన్ డే సెలవులు అనౌన్స్..!!
- అల్ రీమ్ ద్వీపంలోని భవనంలో అగ్నిప్రమాదం..!!
- సౌదీ అరేబియాలో చల్లబడ్డ వాతావరణం..!!
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!







