చైనాలోని హ్యూనన్ ప్రావిన్స్ లో విషాదం..

- June 26, 2016 , by Maagulf
చైనాలోని హ్యూనన్ ప్రావిన్స్ లో  విషాదం..

చైనాలోని హ్యూనన్ ప్రావిన్స్ లో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 30 మంది ప్రయాణికులు అగ్నికి ఆహుతి అయ్యారు. మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి...అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు కూడా ఘటన స్థలికి చేరుకుని... పలువురు ప్రయాణికులను రక్షించారు.
అందులోభాగంగా వారిని ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఉన్నతాధికారులు తెలిపారు. ఆయిల్ లీక్ కావడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. బస్సు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని.... అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి... దర్యాప్తు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com