కేరళ లో ఘోర రోడ్డు ప్రమాదం..మెడికో స్టూడెంట్స్ మృతి
- December 03, 2024
త్రివేండ్రం: కేరళలోని అలెప్పి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. గత రాత్రి భారీ వర్షం సమయంలో వేగంగా వచ్చిన కారు, బస్సును ఢీ కొట్టిన ఘటనలో ఐదుగురు మెడికో స్టూడెంట్స్ మరణించారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రులంతా ఎంబీబీఎస్ ఫస్టియర్ స్టూడెంట్స్గా గుర్తించబడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ ప్రమాదం కాలర్ కోడ్ వద్ద జరిగింది. బస్సును వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టగా, కారు పూర్తిగా నుజ్జవ్వడంతో అందులో ప్రయాణిస్తున్న స్టూడెంట్స్ అందరూ లోపలే ఇరుక్కుపోయారు.
క్షతగాత్రులను బయటకు తీసేందుకు సహాయక సిబ్బంది మెటల్ కట్టర్లను కట్ చేసి, వారి ప్రాణాలను రక్షించారు. గాయపడ్డ వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలే అయినా, వారిని చికిత్స చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన యువకులు దేవనందన్, మొహమ్మద్ ఇబ్రాహీం, ఆయుష్ షాజి, శ్రీదీప్ వాల్సన్, మొహమ్మద్ జబ్బర్గా గుర్తించారు. వీరు టీడీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థులు.
ఈ సంఘటన వారి కుటుంబాలకు ఎంతో దుఖాన్ని కలిగించింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో రోడ్డు భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని స్థానికులు, విద్యార్థులు కోరుతున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







