క్యూలో ఉన్న భక్తులతో టీటీడీ చైర్మన్ మాటామంతీ
- December 03, 2024
తిరుమల: తిరుమలలోని శ్రీవారి దర్శన క్యూలైన్లలో టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా ఏటీజీహెచ్ వద్దనున్న స్లాటెడ్ సర్వ దర్శన క్యూలైన్లను పరిశీలించి నారాయణగిరి షెడ్ల వద్దకు చేరుకున్నారు. అనంతరం ఫుట్ పాత్ హాల్ (దివ్యదర్శనం) ను తనిఖీ చేసి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన క్యూలైన్ లో టీటీడీ అందిస్తున్న సేవలపై భక్తుల అభిప్రాయాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కొందరు భక్తులు లడ్డూలు రుచికరంగా, నాణ్యంగా ఉన్నాయని సంతోషం వ్యక్తం చేశారు.మరికొందరు భక్తులు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనంలో తమకు దర్శనం మరింత త్వరగా అయ్యేలా ఏర్పాట్లు చేయాలని చైర్మన్ ను కోరారు.క్యూలైన్ల విధానం, దర్శన సమయం వంటి అంశాల పై అధికారులతో సమీక్ష నిర్వహించి తగిన ఏర్పాట్లు చేపడతామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, వైకుంఠం ఏవీఎస్ఓ విశ్వనాధ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









