క్యూలో ఉన్న భక్తులతో టీటీడీ చైర్మన్ మాటామంతీ
- December 03, 2024
తిరుమల: తిరుమలలోని శ్రీవారి దర్శన క్యూలైన్లలో టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా ఏటీజీహెచ్ వద్దనున్న స్లాటెడ్ సర్వ దర్శన క్యూలైన్లను పరిశీలించి నారాయణగిరి షెడ్ల వద్దకు చేరుకున్నారు. అనంతరం ఫుట్ పాత్ హాల్ (దివ్యదర్శనం) ను తనిఖీ చేసి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన క్యూలైన్ లో టీటీడీ అందిస్తున్న సేవలపై భక్తుల అభిప్రాయాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కొందరు భక్తులు లడ్డూలు రుచికరంగా, నాణ్యంగా ఉన్నాయని సంతోషం వ్యక్తం చేశారు.మరికొందరు భక్తులు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనంలో తమకు దర్శనం మరింత త్వరగా అయ్యేలా ఏర్పాట్లు చేయాలని చైర్మన్ ను కోరారు.క్యూలైన్ల విధానం, దర్శన సమయం వంటి అంశాల పై అధికారులతో సమీక్ష నిర్వహించి తగిన ఏర్పాట్లు చేపడతామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, వైకుంఠం ఏవీఎస్ఓ విశ్వనాధ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!
- ఆహార వస్తువుల సరఫరా, ధరలపై ఆందోళన వద్దు..!!
- యాస్ ఐలాండ్ లో అటానమస్ టాక్సీల విస్తరణ..!!
- మక్కా, మదీనాలోని భవన యజమానులకు హెచ్చరిక జారీ..!!
- ప్రయాణీకులను హెచ్చరించిన HIA, ఖతార్ ఎయిర్వేస్..!!
- యాదాద్రిలో గవర్నర్ దంపతులు
- తమిళనాడులో వీకే శశికళ కొత్త పార్టీ ప్రారంభం
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం..తీవ్ర వడగాలులు
- ఇక ఆన్లైన్లోనే వాహనాల రిజిస్ట్రేషన్









