సుఖ్బీర్ సింగ్ బాదల్ పై హత్యాయత్నం
- December 04, 2024
పంజాబ్: శిరోమణి అకాలీదళ్ చీఫ్, పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్పై బుధవారం హత్యాయత్నం చోటుచేసుకుంది.ఈ ఘటన అమృతసర్లోని స్వర్ణ దేవాలయం వెలుపల జరిగింది. సేవాదర్ విధుల్లో ఉన్న సమయంలో ఓ వ్యక్తి కాల్పులు జరిపినట్లు సమాచారం. అదృష్టవశాత్తూ బుల్లెట్ గోడను తాకడంతో బాదల్ ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. బాదల్ అప్పట్లో వీల్చైర్లో ఉన్నారు, దీనివల్ల మరింత ప్రమాదం తప్పింది. నారాయణ్ సింగ్గా గుర్తించిన నిందితుడు స్వర్ణ దేవాలయం వెలుపల ఉన్న కొందరు వ్యక్తులపై కూడా దాడికి పాల్పడ్డాడు. దాడి జరిగిన వెంటనే అక్కడున్నవారు అతనిని నిరోధించారు.
పోలీసులు సంఘటన స్థలానికి వెంటనే చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకోవడంతో పాటు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో నిందితుడి మానసిక పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు కారణాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది. సుఖ్బీర్ సింగ్ బాదల్ మీద హత్యాయత్నం వార్త రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. రాజకీయ నాయకులు, ప్రజలు ఈ సంఘటనను ఖండిస్తున్నారు. స్వర్ణ దేవాలయం వంటి పవిత్ర స్థలంలో ఇలాంటి ఘటన జరగడం పట్ల నిరసన వ్యక్తమవుతోంది. పంజాబ్ ప్రభుత్వం ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని ఆదేశించింది. రాజకీయ నాయకుల భద్రతపై ప్రశ్నలు ఉత్థవగా, భద్రతా ఏర్పాట్లను పునఃసమీక్షించాల్సిన అవసరాన్ని నిపుణులు సూచిస్తున్నారు.ఈ సంఘటన రాజకీయంగా రాష్ట్రంలో పలు చర్చలకు కారణమైంది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







