ఇందిరమ్మ ఇళ్ల సర్వే యాప్ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
- December 05, 2024
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్ను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి, జూపల్లి, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గాల్లో నిర్మించే మోడల్ హౌస్ల నమూనా ఆవిష్కరణ చేశారు.ఈ యాప్ ద్వారా లబ్ధిదారుల నమోదు ప్రక్రియను సులభతరం చేయడమే లక్ష్యంగా ఈ ఆప్ డెవలప్ చేశామని అన్నారు. మొబైల్ యాప్ ద్వారా లబ్ధిదారులు తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేయనున్నారు.మొత్తం నాలుగున్నర లక్షల ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ పథకంలో దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్జెండర్లు మొదలైన వారికి తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. గ్రామసభల్లో ఇందిరమ్మ కమిటీల ద్వారా అర్హుల ఎంపిక చేయనున్నారు. ఈ యాప్ ద్వారా దరఖాస్తుదారుల వివరాలు సేకరించి, అర్హతను నిర్ధారించనున్నారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకం తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఇళ్లు నిర్మించేందుకు అందిస్తున్న ఒక ముఖ్యమైన పథకం. ఈ పథకం కింద లబ్ధిదారులకు నాలుగు దశల్లో మొత్తం రూ. 5 లక్షల సాయం అందజేస్తారు. ఈ పథకానికి అర్హత పొందడానికి, లబ్ధిదారుడు దారిద్య్రరేఖ (BPL)కు దిగువన ఉండాలి.రేషన్ కార్డు ఆధారంగా లబ్ధిదారుడిని ఎంపిక చేస్తారు.లబ్ధిదారుడికి సొంతంగా ఖాళీ స్థలం ఉండాలి లేదా ప్రభుత్వం స్థలం ఇచ్చి ఉండాలి. గుడిసె ఉన్నా, గడ్డితో పైకప్పును నిర్మించిన ఇల్లు, మట్టి గోడలతో నిర్మించిన తాత్కాలిక ఇల్లున్నా వారు కూడా అర్హులే. అద్దె ఇంట్లో ఉంటున్నా లబ్ధిదారుడు కావచ్చు.
వివాహమైనా, ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నా లబ్ధిదారుడిగా ఎంపిక కావచ్చు. సింగిల్ ఉమెన్, వితంతు మహిళలూ కూడా లబ్ధిదారులే. గ్రామం లేదా మున్సిపాలిటీ పరిధి వారై ఉండాలి.
ఇందిరమ్మ ఇంటిని మహిళల పేరు మీదే మంజూరు చేస్తారు. గ్రామ, వార్డు సభల్లో ఆమోదం పొందిన తరవాతే లబ్ధిదారులను కలెక్టర్ ఎంపిక చేస్తారు. లబ్ధిదారుల జాబితాను గ్రామసభలో ప్రదర్శించాక సమీక్షించి, ఖరారు చేస్తారు.
ఇంటి నిర్మాణానికి డబ్బులు నాలుగు దశల్లో చెల్లిస్తారు. బేస్మెంట్ స్థాయిలో రూ. లక్ష, పైకప్పు నిర్మాణం జరిగే సమయంలో రూ. లక్ష, పైకప్పు నిర్మాణం పూర్తయిన తరవాత రూ. 2 లక్షలు, ఇంటి నిర్మాణం పూర్తయ్యాక మరో రూ. లక్ష చెల్లిస్తారు. ఈ సాయాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేస్తారు. ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం ఉండదు.
ఈ పథకం ద్వారా వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకం పేదలకు సొంత ఇల్లు కల్పించడంలో ఒక ముఖ్యమైన అడుగు.
మొత్తం మీద, ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్ ద్వారా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం అవుతుంది.ఈ పథకం ద్వారా నిరుపేదలకు సొంత ఇల్లు కల్పించడం లక్ష్యం.
తాజా వార్తలు
- IPL 2026: ముంబై పై పంజాబ్ ఘన విజయం
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో తొలి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ పూర్తి: షేక్ హందాన్ సమీక్ష
- మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ ట్విస్ట్: రమావత్ మధు అరెస్ట్!
- ఇజ్రాయెల్–లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం: ట్రంప్ ప్రకటన
- అమెరికా–ఇరాన్ రెండో దఫా చర్చలు
- ఎయిర్ న్యూజిలాండ్ వినూత్న నిర్ణయం
- గ్రేటర్ హైదరాబాద్లో సీట్ల జాతర
- పార్లమెంటులో కీలక బిల్లుల సందడి..
- డీలిమిటేషన్ పై ప్రధాని మోదీ భరోసా...
- ఢిల్లీ ఎయిర్పోర్ట్లో హైటెన్షన్..2 విమానాలు ఢీ!









