'ఏ రోజైతే చూశానో నిన్ను' చిత్రం ద్వారా హీరోయిన్ గా ఐశ్వర్య గౌడ
- December 05, 2024
మహేష్ బాబు, నాగార్జున, రవితేజ వంటి ప్రముఖ కథానాయకులతో ఎన్నో విజయవంతమైన సినిమాలను అందించిన ఇనావర్స్ సినిమా ఫ్యాక్టరీ మరియు రాస్ర ఎంటర్ టైన్మంట్ సంయుక్తంగా రూపొందిస్తున్నా నూతన చిత్రం 'ఏ రోజైతే చూశానో నిన్ను'. ఈ చిత్రం ద్వారా ఇద్దరు బాల నటులు నూతన నాయకానాయికలు పరిచయమవుతుండటం విశేషం.
స్క్రీన్ ప్లే మరియు విజువల్ ఎఫెక్ట్స్ లో సుపరిచితుడైన రాజు బొనగాని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఏ రోజైతే చూశానో నిన్ను' చిత్రం ద్వారా చెక్, బుర్రకథ, రంగ రంగ వైభవంగా వంటి సినిమాల్లో చైల్డ్ హీరోగా నటించి మెప్పించిన భరత్ రామ్ హీరోగా పరిచయమవుతున్నాడు. అలాగే ఈ చిత్రం ద్వారా ఒక యువ ప్రతిభావంతురాలను హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు.
చార్లీ 777, జాగ్వార్ లాంటి పలు కన్నడ చిత్రాల్లో నటించి బాలనటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య గౌడ 'ఏ రోజైతే చూశానో నిన్ను' చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమవుతోంది. ఈ విషయాన్ని తాజాగా నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.
ఈ డిసెంబర్ నెలలోనే 'ఏ రోజైతే చూశానో నిన్ను' షూటింగ్ ప్రారంభం కానుంది. భరత్ రామ్, ఐశ్వర్య గౌడ లను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న ఈ చిత్రం, అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









