రేవతి కుటుంబానికి 25 లక్షల సాయం ప్రకటించిన అల్లు అర్జున్
- December 07, 2024
హైదరాబాద్: సంధ్య థియేటర్ వద్ద జరిగిన సంఘటనపై అల్లు అర్జున్ స్పందించారు. ఈ సంఘటనపై స్పందించిన ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ సంధ్య థియేటర్ తొక్కిసలాటలో రేవతి చనిపోవడం చాలా బాధాకరం అని తెలిపిన ఆయన ఆమె మృతికి నా తరుపున మా టీమ్ తరుపున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ఈ విషయం తెలిసి నాతోపాటు పుష్ప టీమ్ అంతా కూడా షాక్కు గురైంది. గత 20 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఇలాంటి ఘటన జరగలేదు. మేము సినిమా తీసేదే ప్రేక్షకులు తేటర్ కొచ్చి చూసి ఆనందించడానికి అని తెలిపిన అల్లు అర్జున్ రేవతి కుటుంబానికి నా తరపున 25 లక్షల ఆర్థిక సాయం ప్రకటిస్తున్న అని ప్రకటించాడు. వాళ్ళ కొడుకు హాస్పటల్ ట్రీట్మెంట్ ఖర్చు అంతా మేమే భరిస్తాం అని మరొక సారి ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా జాగ్రత్త పడతామని తెలియజేశారు.
తాజా వార్తలు
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!







