రేవతి కుటుంబానికి 25 లక్షల సాయం ప్రకటించిన అల్లు అర్జున్
- December 07, 2024
హైదరాబాద్: సంధ్య థియేటర్ వద్ద జరిగిన సంఘటనపై అల్లు అర్జున్ స్పందించారు. ఈ సంఘటనపై స్పందించిన ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ సంధ్య థియేటర్ తొక్కిసలాటలో రేవతి చనిపోవడం చాలా బాధాకరం అని తెలిపిన ఆయన ఆమె మృతికి నా తరుపున మా టీమ్ తరుపున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ఈ విషయం తెలిసి నాతోపాటు పుష్ప టీమ్ అంతా కూడా షాక్కు గురైంది. గత 20 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఇలాంటి ఘటన జరగలేదు. మేము సినిమా తీసేదే ప్రేక్షకులు తేటర్ కొచ్చి చూసి ఆనందించడానికి అని తెలిపిన అల్లు అర్జున్ రేవతి కుటుంబానికి నా తరపున 25 లక్షల ఆర్థిక సాయం ప్రకటిస్తున్న అని ప్రకటించాడు. వాళ్ళ కొడుకు హాస్పటల్ ట్రీట్మెంట్ ఖర్చు అంతా మేమే భరిస్తాం అని మరొక సారి ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా జాగ్రత్త పడతామని తెలియజేశారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







