రేవతి కుటుంబానికి 25 లక్షల సాయం ప్రకటించిన అల్లు అర్జున్
- December 07, 2024
హైదరాబాద్: సంధ్య థియేటర్ వద్ద జరిగిన సంఘటనపై అల్లు అర్జున్ స్పందించారు. ఈ సంఘటనపై స్పందించిన ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ సంధ్య థియేటర్ తొక్కిసలాటలో రేవతి చనిపోవడం చాలా బాధాకరం అని తెలిపిన ఆయన ఆమె మృతికి నా తరుపున మా టీమ్ తరుపున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ఈ విషయం తెలిసి నాతోపాటు పుష్ప టీమ్ అంతా కూడా షాక్కు గురైంది. గత 20 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఇలాంటి ఘటన జరగలేదు. మేము సినిమా తీసేదే ప్రేక్షకులు తేటర్ కొచ్చి చూసి ఆనందించడానికి అని తెలిపిన అల్లు అర్జున్ రేవతి కుటుంబానికి నా తరపున 25 లక్షల ఆర్థిక సాయం ప్రకటిస్తున్న అని ప్రకటించాడు. వాళ్ళ కొడుకు హాస్పటల్ ట్రీట్మెంట్ ఖర్చు అంతా మేమే భరిస్తాం అని మరొక సారి ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా జాగ్రత్త పడతామని తెలియజేశారు.
తాజా వార్తలు
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!
- సల్మాబాద్లోని గ్యారేజీని దోచుకున్న ఫేక్ పోలీసులు..!!
- బ్యాడ్మింటన్ గేమ్ ఆడుతూ..కేరళ వాసి మృతి..!!
- దక్షిణ అల్ బటినాలో ఫ్రాడ్ సస్పెక్ట్ అరెస్ట్..!!
- ఖతార్ లో 7 శాతం పెరిగిన FDI లు..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఎయిర్ ఫెయిర్స్ కు రెక్కలు..!!
- ఆన్లైన్ కంటెంట్కు డిజిటల్ ప్లాట్ఫామ్లు బాధ్యత వహించాలి: మంత్రి వైష్ణవ్
- గన్నవరంలో ఈ నెల 28న జాబ్ మేళా
- వాయు శక్తి విన్యాసాలకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
- దుబాయ్ రమదాన్ 2026: పర్యాటకుల కోసం గైడ్









