రేవతి కుటుంబానికి 25 లక్షల సాయం ప్రకటించిన అల్లు అర్జున్
- December 07, 2024
హైదరాబాద్: సంధ్య థియేటర్ వద్ద జరిగిన సంఘటనపై అల్లు అర్జున్ స్పందించారు. ఈ సంఘటనపై స్పందించిన ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ సంధ్య థియేటర్ తొక్కిసలాటలో రేవతి చనిపోవడం చాలా బాధాకరం అని తెలిపిన ఆయన ఆమె మృతికి నా తరుపున మా టీమ్ తరుపున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ఈ విషయం తెలిసి నాతోపాటు పుష్ప టీమ్ అంతా కూడా షాక్కు గురైంది. గత 20 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఇలాంటి ఘటన జరగలేదు. మేము సినిమా తీసేదే ప్రేక్షకులు తేటర్ కొచ్చి చూసి ఆనందించడానికి అని తెలిపిన అల్లు అర్జున్ రేవతి కుటుంబానికి నా తరపున 25 లక్షల ఆర్థిక సాయం ప్రకటిస్తున్న అని ప్రకటించాడు. వాళ్ళ కొడుకు హాస్పటల్ ట్రీట్మెంట్ ఖర్చు అంతా మేమే భరిస్తాం అని మరొక సారి ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా జాగ్రత్త పడతామని తెలియజేశారు.
తాజా వార్తలు
- IPL 2026: ముంబై పై పంజాబ్ ఘన విజయం
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో తొలి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ పూర్తి: షేక్ హందాన్ సమీక్ష
- మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ ట్విస్ట్: రమావత్ మధు అరెస్ట్!
- ఇజ్రాయెల్–లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం: ట్రంప్ ప్రకటన
- అమెరికా–ఇరాన్ రెండో దఫా చర్చలు
- ఎయిర్ న్యూజిలాండ్ వినూత్న నిర్ణయం
- గ్రేటర్ హైదరాబాద్లో సీట్ల జాతర
- పార్లమెంటులో కీలక బిల్లుల సందడి..
- డీలిమిటేషన్ పై ప్రధాని మోదీ భరోసా...
- ఢిల్లీ ఎయిర్పోర్ట్లో హైటెన్షన్..2 విమానాలు ఢీ!









