తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్ని ఆహ్వానించిన మంత్రి పొన్నం

- December 07, 2024 , by Maagulf
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్ని ఆహ్వానించిన మంత్రి పొన్నం

హైదరాబాద్: మాజీమంత్రి కేసీఆర్ తో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం అయ్యారు.ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరపున కేసీఆర్ ను ఆహ్వానించారు మంత్రి పొన్నం. సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్లారు.కేసీఆర్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రోటోకాల్ ప్రజా సంబంధాల సలహాదారు వేణుగోపాల్, ఇతర ప్రోటోకాల్ అధికారులు మంత్రి పొన్నం ప్రభాకర్ వెంట ఉన్నారు. డిసెంబర్ 9న సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నట్లు కేసీఆర్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్.. కేసీఆర్ ను ఆహ్వానించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com