తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్ని ఆహ్వానించిన మంత్రి పొన్నం
- December 07, 2024
హైదరాబాద్: మాజీమంత్రి కేసీఆర్ తో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం అయ్యారు.ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరపున కేసీఆర్ ను ఆహ్వానించారు మంత్రి పొన్నం. సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్లారు.కేసీఆర్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రోటోకాల్ ప్రజా సంబంధాల సలహాదారు వేణుగోపాల్, ఇతర ప్రోటోకాల్ అధికారులు మంత్రి పొన్నం ప్రభాకర్ వెంట ఉన్నారు. డిసెంబర్ 9న సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నట్లు కేసీఆర్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్.. కేసీఆర్ ను ఆహ్వానించారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు







