బహ్రెయిన్ లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్.. ద్వైపాక్షిక సంబంధాలపై ఫోకస్..!!
- December 08, 2024
మనామా: భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ రెండు రోజుల పర్యటన నిమిత్తం బహ్రెయిన్ వచ్చారు. బహ్రెయిన్ విదేశాంగ మంత్రి హెచ్ఇ డా. అబ్దులతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీతో కలిసి 4వ ఇండియా-బహ్రెయిన్ హై జాయింట్ కమిషన్ (హెచ్జెసి)లో పాల్గొననున్నారు. అదే విధంగా 20వ ఐఐఎస్ఎస్ మనామా డైలాగ్ ముగింపు ప్లీనరీ సెషన్లో కూడా జైశంకర్ పాల్గొని మాట్లాడనున్నారు.
ఈ పర్యటన భారతదేశం - బహ్రెయిన్ మధ్య సంబంధాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుందని అధికార యంత్రాంగం తెలిపింది. మంత్రివర్గ సమావేశం ఆర్థిక సహకారాన్ని పెంపొందించడం, ద్వైపాక్షిక సంబంధాల స్వరూపంపై సమీక్షిస్తుందన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు , మౌలిక సదుపాయాల అభివృద్ధిలో తమ భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి రెండు దేశాలు మార్గాలను అన్వేషించాలని భావిస్తున్నాయి. అలాగే ప్రస్తుతం ప్రపంచ వ్యాఫ్తంగా నెలకొన్న యుద్ధ వివాదాలను పరిష్కరించడం, శాంతి మరియు స్థిరత్వాన్ని నిర్ధారించడంపై ఇరుపక్షాలు అభిప్రాయాలను మార్పిడి చేసుకోవాలని భావిస్తున్నాయి. భారత విదేశాఖ మంత్రి సందర్శన ఇండియా- బహ్రెయిన్ మధ్య దీర్ఘకాలిక సంబంధాన్ని బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన దశను సూచిస్తుందని, వివిధ రంగాలలో లోతైన సహకారానికి మార్గం సుగమం చేస్తుందని, ప్రాంతీయ స్థిరత్వం శ్రేయస్సుకు దోహదం చేస్తుందని బహ్రెయిన్ విదేశాంగ కార్యాలయం వెల్లడించింది.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!









