బహ్రెయిన్ లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్.. ద్వైపాక్షిక సంబంధాలపై ఫోకస్..!!
- December 08, 2024
మనామా: భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ రెండు రోజుల పర్యటన నిమిత్తం బహ్రెయిన్ వచ్చారు. బహ్రెయిన్ విదేశాంగ మంత్రి హెచ్ఇ డా. అబ్దులతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీతో కలిసి 4వ ఇండియా-బహ్రెయిన్ హై జాయింట్ కమిషన్ (హెచ్జెసి)లో పాల్గొననున్నారు. అదే విధంగా 20వ ఐఐఎస్ఎస్ మనామా డైలాగ్ ముగింపు ప్లీనరీ సెషన్లో కూడా జైశంకర్ పాల్గొని మాట్లాడనున్నారు.
ఈ పర్యటన భారతదేశం - బహ్రెయిన్ మధ్య సంబంధాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుందని అధికార యంత్రాంగం తెలిపింది. మంత్రివర్గ సమావేశం ఆర్థిక సహకారాన్ని పెంపొందించడం, ద్వైపాక్షిక సంబంధాల స్వరూపంపై సమీక్షిస్తుందన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు , మౌలిక సదుపాయాల అభివృద్ధిలో తమ భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి రెండు దేశాలు మార్గాలను అన్వేషించాలని భావిస్తున్నాయి. అలాగే ప్రస్తుతం ప్రపంచ వ్యాఫ్తంగా నెలకొన్న యుద్ధ వివాదాలను పరిష్కరించడం, శాంతి మరియు స్థిరత్వాన్ని నిర్ధారించడంపై ఇరుపక్షాలు అభిప్రాయాలను మార్పిడి చేసుకోవాలని భావిస్తున్నాయి. భారత విదేశాఖ మంత్రి సందర్శన ఇండియా- బహ్రెయిన్ మధ్య దీర్ఘకాలిక సంబంధాన్ని బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన దశను సూచిస్తుందని, వివిధ రంగాలలో లోతైన సహకారానికి మార్గం సుగమం చేస్తుందని, ప్రాంతీయ స్థిరత్వం శ్రేయస్సుకు దోహదం చేస్తుందని బహ్రెయిన్ విదేశాంగ కార్యాలయం వెల్లడించింది.
తాజా వార్తలు
- సౌదీ నేషనల్ డే వేడుకలు.. జెడ్డా నుంచి అల్ ఖోబర్ వరకు వైమానిక విన్యాసాలు..!!
- సౌదీ అరేబియాకు యుద్ధ విమానాల విక్రయానికి అమెరికా ఆమోదం
- దుగరాజపట్నంలో గ్రీన్ఫీల్డ్ షిప్యార్డ్.. రూ.15 వేల కోట్ల పెట్టుబడులు
- అక్టోబర్ 7న తిరిగి తెరుచుకోనున్న దుబాయ్ పార్క్స్ అండ్ రిసార్ట్స్
- కువైట్లో 172 బాటిళ్ల లిక్కర్ సీజ్.. ప్రవాసుడు అరెస్ట్..!!
- అంగోలాకు చేరుకున్న ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్..!!
- సౌదీలో ఎక్స్పాట్ డాక్టర్పై విచారణ..!!
- యూఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- ఖతార్లో మళ్లీ UFC ఫైట్ నైట్..!!
- ఒమన్లో వాహనదారులకు అలర్ట్.. నవంబర్ 18 స్ట్రీట్లో ట్రాఫిక్ మళ్లింపు..!!







