GPS టెక్నాలజీతో సదరన్ గవర్నరేట్ వేస్ట్ మేనేజ్మెంట్ అప్గ్రేడ్..!!
- December 11, 2024
మనామా: సదరన్ గవర్నరేట్ మునిసిపాలిటీ దాని వ్యర్థ పదార్థాల నిర్వహణ వ్యవస్థకు సమగ్రమైన అప్గ్రేడ్ చేసినట్టు పేర్కొంది. ఇందులో భాగంగా GPS సాంకేతికతను ఉపయోగించుకుంటున్నట్లు వెల్లడించింది. ఇది సామర్థ్యాన్ని పెంపొందించడంతోపాటు నివాస ప్రాంతాల పరిశుభ్రతను మెరుగుపరుస్తుందన్నారు. ఇందులో ప్రస్తుతం అన్ని మెటల్ వేస్ట్ బిన్లను ఆధునిక, పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలతో భర్తీ చేస్తారు. ఈ రియల్ టైమ్ ట్రాకింగ్ సామర్ధ్యం మున్సిపాలిటీని చెత్త డబ్బాల స్థానాలను పర్యవేక్షించడానికి, సమర్థవంతమైన వ్యర్థాల సేకరణ మార్గాలను నిర్ధారించడానికి, ఏవైనా సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు అనుమతిస్తుందని అధికారులు తెలిపారు. ఏదైనా అనధికారిక కదలికలను గుర్తించడం లేదా డబ్బాలను ట్యాంపరింగ్ చేయడం, విధ్వంసం లేదా దుర్వినియోగం వంటి వాటికి వేగంగా స్పందించడానికి సిస్టమ్ సహాయపడుతుందన్నారు. వ్యర్థాల సేకరణను మరింత ఆప్టిమైజ్ చేయడానికి, మునిసిపాలిటీ నివాసితులు తమ చెత్త సంచులను ప్రతిరోజూ రాత్రి 8 నుండి 10 గంటల మధ్య బయట ఉంచాలని సూచించింది. మునిసిపాలిటీ సంప్రదింపు కేంద్రం 17986000 ద్వారా లేదా 17986030కు (వాట్రాప్) ద్వారా వ్యర్థ నిర్వహణకు సంబంధించి ఏవైనా సమస్యలు లేదా పరిశీలనలను నివేదించమని నివాసితులను కోరింది.
తాజా వార్తలు
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!
- షిప్పింగ్ సంస్థలు TIR వ్యవస్థలో నమోదు చేసుకోవాలి: ఖతార్
- టాక్సీ ఛార్జీల పై 50% తగ్గింపు, పార్కింగ్ ఫీజుల నుండి మినహాయింపు..RTA ఒప్పందం..!!









