GPS టెక్నాలజీతో సదరన్ గవర్నరేట్ వేస్ట్ మేనేజ్మెంట్ అప్గ్రేడ్..!!
- December 11, 2024
మనామా: సదరన్ గవర్నరేట్ మునిసిపాలిటీ దాని వ్యర్థ పదార్థాల నిర్వహణ వ్యవస్థకు సమగ్రమైన అప్గ్రేడ్ చేసినట్టు పేర్కొంది. ఇందులో భాగంగా GPS సాంకేతికతను ఉపయోగించుకుంటున్నట్లు వెల్లడించింది. ఇది సామర్థ్యాన్ని పెంపొందించడంతోపాటు నివాస ప్రాంతాల పరిశుభ్రతను మెరుగుపరుస్తుందన్నారు. ఇందులో ప్రస్తుతం అన్ని మెటల్ వేస్ట్ బిన్లను ఆధునిక, పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలతో భర్తీ చేస్తారు. ఈ రియల్ టైమ్ ట్రాకింగ్ సామర్ధ్యం మున్సిపాలిటీని చెత్త డబ్బాల స్థానాలను పర్యవేక్షించడానికి, సమర్థవంతమైన వ్యర్థాల సేకరణ మార్గాలను నిర్ధారించడానికి, ఏవైనా సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు అనుమతిస్తుందని అధికారులు తెలిపారు. ఏదైనా అనధికారిక కదలికలను గుర్తించడం లేదా డబ్బాలను ట్యాంపరింగ్ చేయడం, విధ్వంసం లేదా దుర్వినియోగం వంటి వాటికి వేగంగా స్పందించడానికి సిస్టమ్ సహాయపడుతుందన్నారు. వ్యర్థాల సేకరణను మరింత ఆప్టిమైజ్ చేయడానికి, మునిసిపాలిటీ నివాసితులు తమ చెత్త సంచులను ప్రతిరోజూ రాత్రి 8 నుండి 10 గంటల మధ్య బయట ఉంచాలని సూచించింది. మునిసిపాలిటీ సంప్రదింపు కేంద్రం 17986000 ద్వారా లేదా 17986030కు (వాట్రాప్) ద్వారా వ్యర్థ నిర్వహణకు సంబంధించి ఏవైనా సమస్యలు లేదా పరిశీలనలను నివేదించమని నివాసితులను కోరింది.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!









