GPS టెక్నాలజీతో సదరన్ గవర్నరేట్ వేస్ట్ మేనేజ్మెంట్ అప్గ్రేడ్..!!
- December 11, 2024
మనామా: సదరన్ గవర్నరేట్ మునిసిపాలిటీ దాని వ్యర్థ పదార్థాల నిర్వహణ వ్యవస్థకు సమగ్రమైన అప్గ్రేడ్ చేసినట్టు పేర్కొంది. ఇందులో భాగంగా GPS సాంకేతికతను ఉపయోగించుకుంటున్నట్లు వెల్లడించింది. ఇది సామర్థ్యాన్ని పెంపొందించడంతోపాటు నివాస ప్రాంతాల పరిశుభ్రతను మెరుగుపరుస్తుందన్నారు. ఇందులో ప్రస్తుతం అన్ని మెటల్ వేస్ట్ బిన్లను ఆధునిక, పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలతో భర్తీ చేస్తారు. ఈ రియల్ టైమ్ ట్రాకింగ్ సామర్ధ్యం మున్సిపాలిటీని చెత్త డబ్బాల స్థానాలను పర్యవేక్షించడానికి, సమర్థవంతమైన వ్యర్థాల సేకరణ మార్గాలను నిర్ధారించడానికి, ఏవైనా సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు అనుమతిస్తుందని అధికారులు తెలిపారు. ఏదైనా అనధికారిక కదలికలను గుర్తించడం లేదా డబ్బాలను ట్యాంపరింగ్ చేయడం, విధ్వంసం లేదా దుర్వినియోగం వంటి వాటికి వేగంగా స్పందించడానికి సిస్టమ్ సహాయపడుతుందన్నారు. వ్యర్థాల సేకరణను మరింత ఆప్టిమైజ్ చేయడానికి, మునిసిపాలిటీ నివాసితులు తమ చెత్త సంచులను ప్రతిరోజూ రాత్రి 8 నుండి 10 గంటల మధ్య బయట ఉంచాలని సూచించింది. మునిసిపాలిటీ సంప్రదింపు కేంద్రం 17986000 ద్వారా లేదా 17986030కు (వాట్రాప్) ద్వారా వ్యర్థ నిర్వహణకు సంబంధించి ఏవైనా సమస్యలు లేదా పరిశీలనలను నివేదించమని నివాసితులను కోరింది.
తాజా వార్తలు
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- Kuwait air defences intercept Iranian missile, drone attacks
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్







