దుబాయ్ 'నైట్ సఫారీ'..సందర్శకులకు థ్రిల్లింగ్ అనుభవం..!!
- December 11, 2024
యూఏఈ: దుబాయ్ సఫారీ పార్క్ నైట్ సఫారీ అనుభవాన్ని పొందవచ్చు. డిసెంబర్ 13 నుండి జనవరి 12వరకు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు సందర్శకులను అనుమతిస్తారు. ఇందులో 87 విభిన్న జాతులకు చెందిన 3,000 జంతువులు ఉన్నాయి. దుబాయ్ నైట్ సఫారీలో రాత్రి సమయంలో జంతువుల సహజ ప్రవృత్తులను దగ్గరగా చూసే అవకాశం ఉంటుంది. సందర్శకులు అరేబియా ఇసుక గజెల్, గంభీరమైన దక్షిణ తెల్ల ఖడ్గమృగాలు వంటి జంతువులను చూడవచ్చు. ఇవి ముఖ్యంగా రాత్రి సమయంలో చురుకుగా ఉంటాయి. నైట్ సఫారీ పూర్తిగా భిన్నమైన దృక్కోణాన్ని అందిస్తుంది.
నైట్ సఫారీ సందర్భాంగా పులులు చురుకుగా ఉంటాయి. సింహాలు తమ గంభీరంగా స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. జంతువులు సందర్శకుల వ్యాన్ల చుట్టూ తిరుగుతున్నప్పుడు, థ్రిల్లింగ్ వాతావరణం ఏర్పడుతుంది. సందర్శకులు చల్లటి వాతావరణంలో జంతువులను వాటి సహజ ఆవాసాలలో చూడవచ్చని దుబాయ్ మునిసిపాలిటీలోని పబ్లిక్ పార్క్స్, రిక్రియేషనల్ ఫెసిలిటీస్ డైరెక్టర్ అహ్మద్ అల్ జరౌనీ తెలిపారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







